టీవీ: పైమా మళ్లీ జబర్దస్త్ లోకి వస్తుందా.. నిజమెంత..!!

Divya
ఈటీవీలో ప్రసారమైన పటాస్ కార్యక్రమం ద్వారా పరిచయమయ్యింది కమెడియన్ ఫైమా. అక్కడి వారి దృష్టిలో పడింది ఫైమా దాంతో పటాస్ షోలో కంటెస్టెంట్గా ఎంపికపోవడం జరిగింది. అలా ఆమె ప్రస్థానం మొదటిసారిగా కొనసాగింది. ఆ తరువాత అలాగే కంటిన్యూ అవుతూ పటాస్ కార్యక్రమంలో ఫైమా సాధించిన విజయాలు చాలానే ఉన్నాయి. అయితే ఈ మధ్య జబర్దస్త్ కార్యక్రమంలోకి తీసుకోవడంతో మరింత పాపులర్ అయింది పైమా. ఇక ఆ తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా తన కామెడీ టైమింగ్ తో పంచులతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. దీంతోనే ఈమెకు బిగ్ బాస్ నుండి ఆఫర్ రావడం జరిగింది. దాంతో ఈమె బిగ్ బాస్ లోకి వెళ్లిపోయింది.

సాధారణంగా అయితే ఈ టీవీ మల్లెమాలవారు వదిలేసి వెళ్లిన తరువాత మళ్ళీ రిఎంట్రీ ఉండదు కానీ ఇచ్చేందుకు మల్లెమాలవారు ఓకే చెప్పినట్లుగా సమాచారం. స్టార్ మా మరియు బిగ్ బాస్ నిర్వహకులతో ఉండే ఒప్పందం పూర్తయిన తర్వాత ఈమె మళ్ళి తిరిగి శ్రీదేవి డ్రామా కంపెనీ జబర్దస్త్ వంటి కార్యక్రమాలలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అలాంటి ఒప్పందం ద్వారానే పైన బిగ్ బాస్ లోకి వెళ్లిందన్నట్టుగా సమాచారం. ఇక గతంలో చాలామంది మల్లెమాల సంస్థను వీడి వెళ్లిపోయారు. వారిలో చాలామంది వెనక్కి వచ్చినా కూడా మల్లెమాల సంస్థ వాళ్ళని దూరం పెట్టింది.

ఒకసారి మల్లెమాలను కాదని వెళ్లిపోయిన తర్వాత మళ్లీ రావాలంటే ఖచ్చితంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని అభిప్రాయం కూడా ఉన్నది. అయితే ఈ అభిప్రాయాన్ని మెల్లమెల్లగా మల్లెమాలవారు తగ్గించే విధంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ఈమధ్య జబర్దస్త్ ను విడిపోయి ఇతర చానల్స్ లో బిజీగా ఉన్న వారిని కూడా ఈటీవీ మళ్లీ అవకాశం కల్పిస్తోంది. ఇక దింతో జబర్దస్త్ అభిమానులకు  పైమా వస్తుందని తెలియగానే ఆమె అభిమానుల సైతం సంబరపడిపోతున్నారు. మరి ఇది నిజమో కాదో తెలియాలి అంటే కొద్ది రోజులు ఆగాల్సిందే..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: