టీవీ: ఎన్టీఆర్ షో కి గెస్ట్ లుగా రాబోతున్న ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్స్..!
ఇక ఇప్పటికే ప్రముఖ స్టార్ హీరో రామ్ చరణ్, దర్శకధీరుడు రాజమౌళి, స్టార్ హీరోయిన్ సమంత కూడా వచ్చి ఈ షో లో సందడి చేసిన విషయం తెలిసిందే. ఇకపోతే తాజాగా ఇప్పుడు మరొక స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ ను ఈ షో లో గెస్ట్ లుగా హాజరు పరచడానికి సిద్ధమవుతున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఆ మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరు అనే విషయానికి వస్తే.. ఎస్.ఎస్.థమన్ అలాగే దేవిశ్రీ ప్రసాద్ ఇద్దరు ఈ షో కి హాజరు కాబోతున్నారు. సాధారణంగా ఒకరిని బుల్లితెరపై చూడడానికి రెండు కళ్లు చాలవు అలాంటిది ఇద్దరూ ఒకేసారి సందడి చేయడానికి వస్తే ఖచ్చితంగా ఈ షో మంచి టిఆర్పి రేటింగ్ సాధిస్తుంది అని పలువురు ఇండస్ట్రీ వర్గాల వారు తన అభిప్రాయాలను వ్యక్త పరుస్తున్నారు.
ఇకపోతే ఇద్దరు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ లతో ఎన్టీఆర్ ఎలా సందడి చేస్తాడో చూడడానికి ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అంతేకాదు ఈ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లు కూడా ఎన్టీఆర్ తో కలిసి ఎలా ఆడతారు అనే విషయం తెలుసుకోవడం కోసం బుల్లితెర అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు సమాచారం.