త్వరలో.. బుల్లితెరపై సందడి చేయనున్న మోహన్ బాబు..!

Divya
ఎట్టకేలకు బుల్లితెరపై దర్శనం ఇవ్వడానికి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు రెడీ అవుతున్నారు. ఈ టీవీలో ప్రసారం అవుతున్న ఆలీతో సరదాగా అనే షోకి గత కొన్ని సంవత్సరాలుగా మోహన్ బాబును తీసుకురావడానికి.. షో నిర్వాహకులు ఎంత ప్రయత్నించినప్పటికీ , ఆయన ఒప్పుకోలేదు.. కానీ చివరికి షో నిర్వాహకులు ఎంతో ప్రయత్నం చేస్తే తప్ప, మోహన్ బాబు షో కి హాజరు కావడానికి ఒప్పుకోలేదట.. ఇక సినీ ప్రముఖుల ఇంటర్వ్యూ తో బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న ఈ షో 250 ఎపిసోడ్ కి చేరుకోబోతోంది.. ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్న ఈ ఎపిసోడ్ లో ప్రముఖ నటుడు మోహన్ బాబు సందడి చేయడానికి విచ్చేస్తున్నారు..
ఇకపోతే ఈ షో కి సంబంధించిన ప్రోమో ను తాజాగా విడుదల చేయగా.. ఈ ప్రోమో లో 250 వ ఎపిసోడ్.. కంఠం కంచు..ఇంటి పేరు మంచి.. 400 చిత్రాలకు పైగా విలన్గా.. 60 చిత్రాలకు పైగా నిర్మాతగా..150 చిత్రాలకు పైగా హీరోగా.. ప్రముఖ విద్యావేత్త గా.. రాజకీయవేత్తగా కీర్తి ప్రతిష్టలు ఘడించిన టాలీవుడ్ కలెక్షన్ కింగ్ అంటూ మోహన్ బాబు ఇచ్చే ఎంట్రీని చూపించిన తీరు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.. అయితే త్వరలోనే ఈటీవీలో ఈ షో ప్రసారం కానుంది.. ఇక మోహన్ బాబు, ఆలీతో తన జీవనశైలికి సంబంధించిన విషయాలను, వ్యక్తిగత విషయాలను ప్రేక్షకులతో పంచుకోవడానికి సిద్ధమవుతున్నారు..

అంతేకాదు ఈ ప్రోమోలు మోహన్ బాబు తనదైన శైలిలో.. ఆలీతో సరదాగా.. అతి త్వరలో .. ఈ టీవీ లో.. వెయిట్ అండ్ సీ అంటూ చెప్పే డైలాగ్ విశేషంగా అలరిస్తోంది.. మోహన్ బాబు , ఆలీతో పాటు ప్రేక్షకులతో పంచుకున్న ఆ సరదా సంగతులను మనం కూడా తెలుసుకోవాలి అంటే, మరి కొద్ది రోజులు వేచి ఉండక తప్పదు.. అప్పటి వరకు ఈ ప్రోమో ని చూస్తూ ఆస్వాదిస్తూ.. షో కోసం ఎదురు చూడాల్సిందే.. ఇక పోతే ఈ షో ద్వారా ఆలీ.. మోహన్ బాబు  కు సంబంధించిన వ్యక్తిగత విషయాలను ఎలా రాబడతారో తెలుసుకోవడానికి మనం కూడా వేచి చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: