టీవీ: ముద్దమందారం ఫేమ్ తనూజ ఎవరో తెలుసా..?

Divya

ఇటీవల వెండితెరపై హీరోయిన్ లతో సమానంగా.. బుల్లితెరపై కూడా హీరోయిన్లు అంతే స్థాయిలో అవకాశాలు పొందుతూనే స్టార్ ఇమేజ్ ను కూడా సొంతం చేసుకుంటూ ఉన్నారు. అలాంటి వారిలో ఇటీవల బాగా పాపులర్ పొందిన సీరియల్ ముద్దమందారం . ఈ సీరియల్ లో చక్కటి అందంతో ప్రేక్షకులను అలరించిన ఓ సుందరి, తెలుగు  ప్రేక్షకులకి బాగా దగ్గరైంది ఆమె మేగోటి పార్వతి పాత్రలో నటించిన తనూజ. ఈమె ఈ సీరియల్ ద్వారావిశేష ఆదరణ కూడా పొందుతోంది.. మొదటి సీరియల్ తోనే ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. ఇక ఈమె పూర్తి విషయాలను ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం...

తనూజ పుట్టింది కర్ణాటక రాష్ట్రం లోని బెంగళూరులో 1992వ సంవత్సరం 5వ తేదీన సావిత్రి , పుట్టస్వామి  దంపతులకు జన్మించింది.. ఇక ఈమెకు ఇద్దరు సిస్టర్స్ కూడా ఉన్నారు. ఒకరు పూజ గౌడ, మరొకరు అనూజ గౌడ. తన విద్యాభ్యాసాన్ని న్యూ హారిజాన్ పబ్లిక్ స్కూల్ అలాగే సెయింట్ జోసెఫ్ కాలేజీలో ముగించుకుంది అయితే ఈమెకు కల్చర్ యాక్టివిటీస్ పైన అలాగే  డాన్స్  కూడా చాలా ఇష్టం ఉండేదట. అందుకోసమే ఆమె  డాన్స్ కూడా నేర్చుకుంది.. నటన మీద ఆసక్తి ఎక్కువ ఉండటంతో కాలేజీలో చదువు పూర్తయిన వెంటనే లోకల్ చానల్స్ లో యాంకర్ గా కూడా పని చేసింది.
ఆ తర్వాత ఒక షార్ట్ ఫిలిం ఇప్పపురం లో కూడా చేసింది. అయితే తనకు అక్కడ పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ తెలుగులో జీ తెలుగు లో ప్రసారం అయిన ముద్దమందారం సీరియల్ ద్వారా బాగా పాపులారిటీ అందుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ సీరియల్ తో  బెస్ట్ యాక్ట్రెస్ అవార్డును కూడా సొంతం చేసుకుంది.. వీటితో పాటు జీ తెలుగు కుటుంబం అవార్డు, అప్సర అవార్డులను కూడా సొంతం చేసుకోవడం గమనార్హం. మొదట తనూజ సీరియల్స్ లోకి రావడం మీరు తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా బలవంతంగా వచ్చింది ..కానీ ఇప్పుడు ఈమెకున్న క్రేజ్ చూసి వారు కూడా ఎంకరేజ్ చేస్తున్నట్లు సమాచారం.. ఒక్కొక్క ఎపిసోడ్ కు 19 వేల రూపాయలను తీసుకుంటుంది. 43 లక్షలకు పైగా అత్యంత విలువైన ఒక కారు కూడా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: