టీవీ : మతం వేరైనా కూడా ఆ పని చాలాసార్లు చేశానంటున్న సమీర్..?

Divya
టాలీవుడ్ లో బుల్లి తెర పై, వెండితెరపై ఒక నటుడిగా బాగా గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు సమీర్.. తన చిన్నతనంలోనే తన తండ్రికి దూరమయ్యాడట నటుడు సమీర్.. చిన్న వయసులో నుంచి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఒక నటుడిగా ఎదిగాడు. కేవలం తన ఇంటి నుంచి 1600 రూపాయలు తీసుకొని రైలెక్కి హైదరాబాద్ వచ్చి.. ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడట.

అలా ఒక్కో మెట్టు ఎదుగుతూ ఎన్టీఆర్ ,రామ్ చరణ్ వంటి స్టార్ హీరోల సరసన నటించి, వారికి మంచి స్నేహితుడు గా ఉన్నాడు. ఇక ఆ పరిచయాలతో నే బిగ్ బాస్  లో కూడా బుల్లితెర ప్రేక్షకులను అలరించాడు. తను రిల్ లైఫ్ లోనే కాకుండా, రియల్ లైఫ్ లో కూడా ఇబ్బందులను ఎదుర్కొన్నాడట. తాజాగా తను మతం పై కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు..

సమీర్ అన్ని భాషలను, అన్ని మతాలను గౌరవిస్తాడట. తన ఇంట్లోనే దేవుని గదిలోకి వెళ్ళి చూస్తే.. అన్ని మతాల స్వాములు అక్కడ ఉంటారు. నన్ను ఎవరైనా మీరు ముస్లిమా అని అడిగితే.. నేను ముందుగా చెప్పే పదం ఏమిటంటే.. నేను ఇండియన్ అని చెబుతాను అని చెప్పుకొచ్చాడు. నేను ఏ మతాన్ని కించపరచడం లేదు. ఏ మతమైన ఒకరే అని తెలియజేస్తున్నాను అని చెప్పుకొచ్చాడు.

తన తండ్రి ముస్లిం, తల్లి బ్రాహ్మణట. అంతే కాకుండా తన అయ్యప్ప మాలని ఎన్నోసార్లు వేసి 65 రోజులు దీక్షలో కూడా ఉన్నానని తెలియజేశాడు. నేను అలా చేయడం చిరంజీవి చూసి చాలా షాక్ కు గురయ్యారట. సరిగ్గా అప్పుడే జై చిరంజీవ సినిమా షూటింగ్ జరుగుతుండడంతో.. చిరంజీవి తననిలా అడిగాడట ఏంటి సమీర్ అంతా కన్ఫ్యూజన్ గా ఉంది.. మీ పేరు సమీర్.. కానీ నువ్వు వేసుకున్నది అయ్యప్పమాల అని అడిగారు.
చిరంజీవి తో కూడా ఇలానే చెప్పాను.. వెంటనే ఆయన నువ్వు సూపర్ అని ఆనందపడ్డారట. ఇక ఇండస్ట్రీలో తనకు ఎంతో మంది తన పేరునే మార్చుకోమని చెప్పినా కూడా వినలేదట ఈయన..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: