టీవీ : రోహిణి బుల్లితెర పైకి ఎలా వచ్చిందో తెలుసా..?
బుల్లితెరపై అతి తక్కువ సమయంలోనే తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నది రోహిణి. ఈమె అసలు పేరు ఏమిటంటే రోహిణి రెడ్డి. ఇక అంతే కాకుండా ఈమెను ముద్దుగా రౌడీ పిల్ల అని పిలుస్తారు. అయితే ఈమె గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం.
చాలా బిజీగా ఉన్న సమయంలో 2016 లో కారు ప్రమాదంలో తీవ్రంగా గాయాలపాలయ్యారు. దీంతో ఒక సంవత్సరం పాటు అన్నింటికీ దూరంగా ఉంది రోహిణి. ఇక చాలా రోజుల తర్వాత జబర్దస్త్ షో ద్వారా రీ ఎంట్రీ ఇచ్చింది రోహిణి. ఇక అంతే కాకుండా 2019 లో బిగ్ బాస్ లో పాల్గొంది. ఈమెకి ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. ఈమెకు ఒక్కొక్క ఎపిసోడ్ కు 20 వేల రూపాయల వరకు ఇస్తారట. అంతేకాకుండా హైదరాబాదులో కోటి రూపాయలు విలువ చేసే ఒక అపార్ట్మెంట్ ఉంది. ఇక ఈమెకు రెండు ఖరీదైన కార్లు ఉన్నాయి. ఈమెకు చిరంజీవి, శ్రీదేవి, నాగార్జున అంటే చాలా ఇష్టమట.