బుల్లి పిట్ట: నీటిలో .. దుమ్ములో వర్క్ అయ్యే సరికొత్త మొబైల్..!!

Divya
ఒకప్పుడు మొబైల్ దిగ్గజా రారాజుగా పేరుపొందింది నోకియా. ఆ తర్వాత స్మార్ట్ ఫోన్లు రావడంతో మార్కెట్లో పెద్దగా పాపులర్ కాలేక పోయింది. తాజాగా ఇప్పుడు నిజంగా మళ్లీ స్మార్ట్ మొబైల్ ని విడుదల చేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మార్కెట్లోకి మరో అద్భుతమైన స్మార్ట్ మొబైల్ ను విడుదల చేస్తోంది. నోకియా XR -21 పేరుతో లాంచ్ చేసిన ఈ స్మార్ట్ మొబైల్ ఇప్పటికే పలు దేశాలలో అందుబాటులోకి రావడం జరిగింది. త్వరలోనే ఇండియాలో లాంచ్ కాబోతున్నట్లు తెలుస్తోంది.ఈ స్మార్ట్ మొబైల్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Nokia XR -21 మొబైల్ 6.49 అంగుళాల ఫుల్ హెచ్డి+IPS ఎల్సిడి డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఈ మొబైల్ డిస్ప్లేకు ప్రత్యేకత డిస్ప్లేగా గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ కలదు. మొబైల్ ఆక్టా కోర్ వెల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 -5G SOC ప్రాసెస్తో పనిచేస్తుంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ -12 ఆధారంగా పనిచేస్తుందట.ఇక కెమెరా విషయానికి వస్తే ఈ స్మార్ట్ మొబైల్ లో 64 మెగా ఫిక్షన్ రేర్ కెమెరాతోపాటు సెల్ఫీ ఫ్రీల కోసం 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా కలదు.

ఈ మొబైల్ బ్యాటరీ విషయానికి వస్తే స్మార్ట్ మొబైల్ లో 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో పాటు 4800 MAH సామర్థ్యంతో కలదు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలదు ముఖ్యంగా ఈ స్మార్ట్ మొబైల్ కు మరొక ప్రత్యేకత ఉన్నది ముఖ్యంగా దీని బాడీ అని చెప్పవచ్చు. ఈ స్మార్ట్ మొబైల్ బాడీ చాలా దృఢంగా రూపొందించబడినట్లు తెలుస్తోంది ఈ స్మార్ట్ మొబైల్ లో నీటి దూళి రిసిస్టెంట్ కోసం..IP69K రేటింగును అందించినట్లు తెలుస్తోంది.ఈ మొబైల్ కేవలం 6GB RAM+128 స్టోరేజ్ వేరియంట్ తో కలదు సరికొత్త టెక్నాలజీ తో ఈ మొబైల్ ని తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: