ఇండియాలో ఆ సోలార్ ఈవీ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు!

సోలార్ పవర్ తో పనిచేసే ఈవీ ఛార్జింగ్ సొల్యూషన్స్ ను అందించే సంస్థ ఆటమ్ ఛార్జ్ (Atum Charge) కేవలం ఆరు నెలల్లో దేశవ్యాప్తంగా 250 యూనివర్సల్ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్‌ల ఇన్‌స్టాలేషన్‌ను కంప్లీట్ చేసినట్లు ప్రకటించింది. ఈ మొత్తం 250 చార్జింగ్ స్టేషన్లలో తెలంగాణా రాష్ట్రంలోనే ఎక్కువగా 48 సోలార్ ఈవీ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు.ఇక ఆ తర్వాత తమిళనాడులో 44, మహారాష్ట్రలో 36, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలలో ఒక్కొక్కటి 23, ఉత్తరప్రదేశ్‌లో 15, హర్యానాలో 14 ఇంకా అలాగే ఒడిశాలో 24 స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.టైర్ 2 ఇంకా టైర్3 పట్టణాలు మరియు నగరాలపై దృష్టి సారించే కంపెనీ వ్యూహంలో భాగంగా, ఈ సోలార్ ఈవీ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. రాబోయే నెలల్లో, కంపెనీ మరిన్ని అదనపు నగరాలు ఇంకా అలాగే రాష్ట్రాలలో తమ సోలార్ ఈవీ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది.


ఇక ఈ సోలార్ ఈవీ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుతో దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణ అనేది మరింత వేగవంతం కాదలదని ఆ కంపెనీ ధీమాగా ఉంది.ఇక ఆటమ్ చార్జ్ గత సంవత్సరం సెప్టెంబర్‌ నెలలో హైదరాబాద్‌లో ఫస్ట్ టైం ఇలాంటి సోలార్ ఛార్జింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేసింది. ఇది ఛార్జింగ్ సొల్యూషన్ విద్యుత్ ఉత్పత్తి చేసే ఇంటిగ్రేటెడ్ సోలార్ రూఫ్‌ని ఉపయోగిస్తుంది. ఇంకా ఇది మొత్తం ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ కు సరిపోయే విద్యుత్ ను 100 శాతం సోలార్‌కి మార్చడానికి వీలు అనేది కల్పిస్తుంది.ఇక సాంప్రదాయ ఈవీ ఛార్జింగ్ స్టేషన్‌లు థర్మల్ పవర్‌ని ఉపయోగించి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తాయి కాబట్టి, ఇవి పవర్ గ్రిడ్‌పై కూడా అదనపు ఒత్తిడిని కూడా కలిగిస్తాయి. కానీ, సోలార్ ఈవీ చార్జింగ్ విషయంలో మాత్రం ఈ సమస్య అనేది ఉండదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: