తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద సోలార్‌ ప్లాంట్‌.. విద్యుత్తు ఆదానే ముఖ్య ఉద్దేశం

Suma Kallamadi

తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్తును ఆదా చేయాలి అన్న ఉద్దేశ్యంతో చాలా చోట్ల సోలార్ ప్లాంట్లను బిగించడం జరుగుతున్నది. అందులో భాగంగా రాష్ట్రంలో అతిపెద్దైన  రూఫ్‌టాప్‌ సోలార్‌ పవర్‌ప్లాంట్‌ను జూబ్లీహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీ)లో నెలకొల్పడం జరిగినది.. 2018లో 500 కిలో వాట్ల ప్లాంట్‌ను ఏర్పాటు చేసిన ఈ సంస్థ తాజాగా మరియొక 350 కిలోవాట్ల సామర్థ్యం గల మరో ప్లాంట్‌ను ఏర్పాటు చేయడం  గమనార్హం.. 

 

దీంతో రెండు కలిపి రాష్ట్రంలోనే అతిపెద్ద సోలార్‌ ప్లాంట్‌గా నిలిచాయి. ఈ ప్లాంట్లు నెలకు దాదాపు రూ.9 లక్షల విద్యుత్‌ బిల్లులను ఆదా చేయడము జరుగుతున్నది.. మొత్తంగా రూ.3.81 కోట్లు వెచ్చించి ప్లాంట్లు నెలకొల్పడం జరిగింది. 

 

ఇందులో భాగంగా రూ.95 లక్షల (25 శాతం)ను జాతీయ పునరుత్పాదక ఇంధన వనరుల సంస్థ రీయింబర్స్‌ చేయడం హర్షించదగ్గ విషయం. మరికొంత సమయం లో మరో 150 కిలోవాట్ల సామర్థ్యం గల రూఫ్‌టాప్‌ సోలార్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడం జరుగనున్నది దీని ద్వారా 1,000 కిలోవాట్ల సామర్థ్యం గల ప్లాంట్‌గా మార్చనున్నట్లు సంస్థ వర్గాలు తెలియచేయడం జరిగింది.. రూఫ్‌టాప్‌ సోలార్‌ నెట్‌ మీటరింగ్‌లో భాగంగా భవనాలపైగల సోలార్‌ ప్లాంట్‌ ను డిస్కం గ్రిడ్‌కు కనెక్షన్‌ ఇవ్వడము జరుగుతుంది . ఇలా నిర్మించిన ఎవరి భవనాల పై ఉత్పత్తయిన విద్యుత్‌ను వారు వాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మిగిలినటువంటి విద్యుత్‌ను డిస్కంలకు అమ్మవలసి ఉంటుంది.

 

 సోలార్‌ ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్‌ను డిస్కంలు కొనుగోలు చేసి అటు పిమ్మట కావలసిన వినియోగదారులకు సరఫరా చేస్తాయి. ఇలా ఇంటి పైన సోలార్ ద్వారా ఉత్పత్తి చేసిన విద్యుత్తును ఇంటి యజమాని వద్ద డిస్కంలు కొనుగోలు చేయడం జరుగుతుంది. ఇలా డిస్కంలు యూనిట్‌కు రూ.4.08 చొప్పున చెల్లించాలి. కాబట్టి ఇప్పటినుంచి మనము కూడా ఎవరి డాబా పైన వాళ్ళము సోలార్ ప్లేట్లను ఉపయోగించి విద్యుత్తు తయారు చేసుకుంటే ప్రభుత్వానికి కూడా మేలుచేసిన వాళ్ళము అవుతాము.

 
 
 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: