రూ.1,999 కే స్మార్ట్‌ వాచ్..!

ప్రపంచం టెక్నాలజీ పరంగా ఎంతో దూసుకు వెళ్తుంది. ఎన్నో కొత్త కొత్త వస్తువులను ఆవిష్కరిస్తూ..మనిషికి అవసరమయ్యే సౌకర్యాలను అందుబాటులోకి తెస్తున్నారు. కమ్యూనికేషన్ పరంగా ఇప్పటికే అధునాతన మొబైల్స్ ని మార్కెట్ లోకి తీసుకు వచ్చారు.  తాజాగా ఎన్నో అద్భుతమైన ఫీచర్స్ కలిగిన దేశీయ కంప్యూటర్ ఉపకరణాల సంస్థ అంబ్రేన్  చవక ధరలో స్మార్ట్‌ వాచ్‌ ను లాంచ్‌ చేసింది. 

 ఏఎస్‌ డబ్ల్యు-11 పేరుతో దేశీయ సంస్థ అంబ్రేన్ ఈ రోజు త‌క్కువ ధరకే స్మార్ట్‌ వాచ్‌ ను విడుద‌ల చేసింది.  ఈ  స్మార్ట్ వాచ్  ఫిట్నెస్ ట్రాకర్ గా పనిచేస్తుందని కంపెనీ చెబుతోంది. ఇప్పుడు మనిషి ఫిట్ నెస్ కోసం ఎంతో కష్టపడుతున్నారు..అయితే ఈ స్మార్ట్ వాచ్ తో ఫిట్నెస్ కార్యకలాపాలను ట్రాక్ చేయవ‌చ్చ‌ని తెలిపింది. ఇందులోని పెడోమీటర్ యూజ‌ర్ల‌ నడకదూరాన్ని, స్లీప్‌ పాటర్నీ కూడా పరిశీలిస్తుందని చెప్పింది.

చాలా ఖరీదైన వాచ్‌లను ఇది రీప్లేస్‌ చేస్తుందనీ, అలాగే  ఫిట్నెస్ ట్రాకర్ పాత్రను కూడా  పోషిస్తుందని  అంబ్రేన్ ఇండియా డైరెక్టర్ గౌరవ్ దూరెజా తెలిపారు. ఈ వాచ్‌ను బ్లాక్‌ కలర్‌లో అందుబాటులోకి తెచ్చామ‌ని చెప్పింది. ఒక సంవత్సరం వారెంటీ కూడా ఇస్తున్నామ‌ని తెలిపింది. ఏఎస్‌ డబ్ల్యు-11 ను అన్ని ప్రముఖ రిటైల్, ఈ-టెయిల్ స్టోర్లలో కొనుగోలు చేయ‌వ‌చ్చ‌ని చెప్పింది. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: