వరల్డ్ కప్ సంగ్రామం రసవత్తరంగా సాగుతున్నది. ఇండియా మ్యాచ్ లు అంటే జనాలు ఎక్కువగా వస్తారు. అందుకే దాదాపుగా ఇండియా మ్యాచ్ లు అన్ని సండే రోజున వచ్చేలా షెడ్యూల్ చేశారు. అయితే, ఈ వరల్డ్ కప్ లో టీమ్ లు గెలిచిన మ్యాచ్ లు కంటే వర్షం కారణంగా ఆగిపోయిన మ్యాచ్ లు ఎక్కువగా ఉన్నాయి.
దీనిపై నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ ట్రోల్ నుంచి బయటపడితే రేపటి మ్యాచ్ జరుగుతుంది. రేపు ఇండియా.. పాక్ జట్ల మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. ఇండియా పాక్ మ్యాచ్ అంటే చెప్పాల్సిన అవసరం లేదు ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.
రేపటి మ్యాచ్ కోసం యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తుంటుంది. ఇరు దేశాల మధ్య ఒక వార్ జరుగుతున్నట్టుగా చూస్తుంటారు. ఈ మ్యాచ్ రెండు జట్లకు కీలకమైనది. అయితే, ఇండియా కంటే కూడా పాకిస్తాన్ కు ఈ మ్యాచ్ కీలకం. రేవు మ్యాచ్ వర్షార్పణం కాకుండా జరిగితే.. రేటింగ్ ఎక్కడో ఉంటుంది.
ఆదివారం సెలవు దినం కావడంతో ఈ మ్యాచ్ వలన మిగతా సినిమాలకు కూడా ఎఫెక్ట్ పడుతుంది. పల్లెటూరి నుంచి పెద్ద పెద్ద నగరాల వరకు రేపు మధ్యాహ్నం నుంచి బోసిపోయి కనిపిస్తాయి. మరి రేపటి మ్యాచ్ ఎలా ఉండబోతుంది. ఎలాంటి సంఘటనలు మ్యాచ్ లో చోటు చేసుకోబోతున్నాయి అన్నది ఆసక్తికరం.