ఆఫ్ఘానిస్థాన్ టీమ్పై బ్యాన్.. పంతం పట్టి చేశారుగా!
అయితే అలాంటి ఆఫ్ఘాన్కు తాజాగా ఊహించని షాక్ ఒకటి తగిలింది. అవును, ఆ టీమ్ ఇప్పుడు నిషేధం అంచున కొట్టుమిట్టాడుతోంది. అవును, ఆఫ్ఘానిస్థాన్ టీమ్ను బ్యాన్ చేయాలని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ మీద రోజురోజుకీ ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. వచ్చే నెలలో జరిగే చాంపియన్స్ ట్రోఫీలో ఆఫ్ఘాన్తో మ్యాచ్ అయితే ఇక ఆడేది లేదంటూ ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ప్రకటించేసింది. ఆ జట్టును బ్యాన్ చేయాల్సిందేనని పట్టుబడుతోంది. క్రికెట్ ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా బోర్డుల మద్దతుతో ఐసీసీ మీద ప్రెజర్ పెడుతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
అయితే ఆఫ్ఘాన్తో మ్యాచ్ ఆడమని ఈసీబీ చెప్పడానికి ఓ రీజన్ ఉంది. మహిళల హక్కులపై ఆంక్షలు విధిస్తున్న తాలిబన్ సర్కారు ఆగడాల మీద ఇంగ్లండ్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి విదితమే. ఇందులో భాగంగానే ఆఫ్ఘాన్ టీమ్తో మ్యాచ్ను బహిష్కరించాలని ఇంగ్లండ్ బోర్డుపై ఒత్తిళ్లు వస్తున్నాయి. మ్యాచ్ ఆడొద్దంటూ 160 మందికి పైగా అక్కడి నేతలు ఈసీబీకి అల్టిమేటం జారీ చేయడం కొసమెరుపు. దానికి కారణం తాలిబన్ల ఏలుబడి అని ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆఫ్ఘానిస్థాన్లో మహిళలు, బాలికల మీద తీవ్ర వివక్ష చూపిస్తున్నారు. బాలికలు ఆరో తరగతికి మించి చదవకూడదని రూల్ విధించారు. అదేవిధంగా స్త్రీలు జాబ్స్ చేయొద్దని, జిమ్, పార్కులతో పాటు బహిరంగ ప్రదేశాల్లో కనిపించకూడదని స్ట్రిక్ట్ రూల్స్ వేశారు. క్రీడల్లోనూ అక్కడి మహిళలు పాల్గొనకుండా నిషేధం విధించడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.