వారెవ్వా.. టైటిల్ గెలిచిన టీమ్ ఇండియాకు.. జై షా బంపర్ ఆఫర్?

praveen
ఎన్నో రోజులుగా భారత క్రికెట్ ప్రేక్షకులందరూ నిరీక్షణ ఎదురుచూస్తున్న కల నిజమైంది. వెస్టిండీస్, యూఎస్ వెహికల్ జరిగిన టి20 ప్రపంచ కప్ లో భారత జట్టు ఘన విజయాన్ని అందుకుంది అన్న విషయం తెలిసిందే. భారత క్రికెట్ ప్రేక్షకుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయ్ అనడంలో సందేహం లేదు. దాదాపు 17 ఏళ్ల తర్వాత టీమిండియా t20 వరల్డ్ కప్ ను ముద్దాడింది అని చెప్పాలి. ఎంతోమంది కెప్టెన్లు మారినా చివరికి రోహిత్ శర్మ కెప్టెన్సీ లో ఇది సాధ్యమైంది అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే ఇక ఇటీవల గెలిచిన వరల్డ్ కప్ టోర్నలతో భారత జట్టు అటు నాలుగు ప్రపంచ ప్రపంచ కప్ లు గెలిచిన జట్టుగా అవతరించింది. కాగా ఇక ఇలా వరల్డ్ కప్ కలను సహకారం చేసుకుని ఆనందంలో మునిగిపోయిన టీమ్ ఇండియా ఆటగాళ్లు అందరికీ కూడా బీసీసీఐ సెక్రటరీ జై షా ఒక బంపర్ ఆఫర్ ప్రకటించాడు. ఏకంగా టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన భారత జట్టుకు 125 కోట్ల రూపాయల నగదు బహుమతిని బీసీసీఐ సెక్రటరీ జైషా ప్రకటించారు. టోర్నీ మొత్తం టీమిండియా అసాధారణమైన ప్రతిభ నిబద్ధత క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించింది అంటూ సోషల్ మీడియాలో ప్రకటించారు ఆయన.

అత్యుత్తమ విజయాన్ని అందుకున్న ప్లేయర్లు కోచులు సహాయక సిబ్బందికి కూడా అభినందనలు తెలియజేశారు. అయితే టీమిండియా వరల్డ్ కప్ గెలిచిన వెంటనే అటు మైదానంలో ఎన్నో ఎమోషనల్ సన్నివేశాలు కనిపించాయి అన్న విషయం తెలిసిందే.మరీ ముఖ్యంగా ఇలా వరల్డ్ కప్ గెలిచిన వెంటనే తమ రిటైర్మెంట్కు ఇదే సరైన సమయం అని భావించిన టీమ్ ఇండియాలో స్టార్ ప్లేయర్లుగా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు తమ అంతర్జాతీయ టి20 కెరియర్ కు రిటైర్మెంట్ ప్రకటించి అభిమానులందరికీ కూడా షాక్ ఇచ్చారు. రానున్న రోజుల్లో భారత జట్టు కు t20 ఫార్మాట్లో కొత్త కెప్టెన్ రాబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: