Ind Vs Pak: టీమిండియా బలం అదే.. గెలవడం పక్కా?

Purushottham Vinay
టీ 20 ప్రపంచకప్ లో హై ఓల్టేజ్ మ్యాచ్కి రంగం అనేది సిద్ధమైంది. గ్రూప్ ఏలో దాయాదుల నేడు పోరు జరగనుంది. మొదటి మ్యాచ్లో ఘన విజయం సాధించిన టీమిండియాతో అమెరికా చేతిలో కంగుతిన్న పాకిస్థాన్ తలపడనుంది.న్యూయార్క్లోని "Nassau County international Cricket Stadium" లో జరగనున్న ఈ మ్యాచ్లో పిచ్పైనే అందరి దృష్టి ఉంది. ఎందుకంటే ఈ పిచ్పై ఇప్పటి దాకా మూడు మ్యాచులు జరగగా ఆరు ఇన్నింగ్సుల్లో రెండుసార్లు మాత్రమే వందకుపైగా పరుగులు నమోదయ్యాయి. బౌలర్లు చెలరేగిపోతున్న ఈ పిచ్పై భారత్-పాక్ బ్యాటర్లు ఎలా రాణిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రోహిత్, కోహ్లీ, జైస్వాల్, పంత్, హార్దిక్ పాండ్యా ఇంకా సూర్యలతో కూడిన... భారత బ్యాటింగ్ లైనప్ బాగా బలంగా కనిపిస్తోంది. బుమ్రా సారథ్యంలోని బౌలింగ్ దళం కూడా బాగానే ఉంది. మొదటి మ్యాచ్లో అమెరికా చేతిలో సూపర్ ఓవర్లో ఓటమి పాలైన పాకిస్థాన్... ఈ మ్యాచ్లో గెలిచి ముందడుగు వేయాలని చూస్తోంది. అమెరికాతో జరిగిన మ్యాచ్లో కెప్టెన్ బాబర్ రాణించినా కూడా మిగిలిన బ్యాటర్లు... విఫలమయ్యారు.ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో ఘన విజయం సాధించి మంచి ఊపు మీదున్న ఇండియా అదే ఊపులో పాక్ను చిత్తు చేయాలని చూస్తోంది.


తొలి మ్యాచ్లో  స్వల్ప లక్ష్యం కావడంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా విజయం సాధించింది. అయితే పాక్తో జరిగే ఈ హై ఓల్టేజ్ మ్యాచ్లో రోహిత్శర్మ-విరాట్ కోహ్లీ జోడీ మంచి ఆరంభాన్ని ఇస్తే ఇక పాకిస్థాన్కు ఖచ్చితంగా ఇబ్బందులు తప్పవు. ఈ మ్యాచ్లో రోహిత్కు జోడీగా విరాట్ వస్తాడా లేక యశస్వి జైస్వాల్ను బరిలో దింపుతారా అనేది చూడాలి. ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ త్వరగానే అవుటైనా రోహిత్ శర్మ మాత్రం ఉన్నంతవరకూ కొంచెం దూకుడుగానే ఆడాడు. హిట్ మ్యాన్ 37 బంతుల్లో 52 పరుగులు చేసి విజయంలో కీలకపాత్ర పోషించడం జరిగింది. వన్ డౌన్లో బ్యాటింగ్కు వచ్చిన రిషబ్ పంత్ కూడా బాగానే సత్తా చాటాడు. 26 బంతులు మాత్రమే ఎదుర్కొన్న పంత్ మొత్తం 36 పరుగులు చేసి రాణించాడు. ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ, ప్రపంచ నెంబర్ వన్ టీ 20 బ్యాటర్  అయిన సూర్యకుమార్ యాదవ్ తక్కువ పరుగులకే అవుటవ్వడం జరిగింది. ఈ మ్యాచ్లో బాగా రాణించి మళ్లీ ఫామ్ను అందిపుచ్చుకోవాలని విరాట్, సూర్య గట్టి పట్టుదలతో ఉన్నారు. వీళ్లతో పాటు మిగిలిన బ్యాటర్లు కూడా సత్తా చాటితే పాకిస్థాన్ కి ఇక తిప్పలు తప్పవు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: