రూ. 20 కోట్లు ఇచ్చిన బాబర్ ఐపీఎల్ ఆడడు.. పాక్ మాజీ షాకింగ్ కామెంట్స్?

praveen
బీసీసీఐ ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రపంచ క్రికెట్లో ఎంత ప్రఖ్యాతిగాంచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక వరల్డ్ క్రికెట్లో రిచెస్ట్ క్రికెట్ లీగ్ గా కొనసాగుతుంది ఐపీఎల్. అందుకే ఇక స్వదేశీ ఆటగాళ్లతో పాటు విదేశీ ఆటగాళ్లు కూడా ఐపీఎల్ లో భాగం కావడానికి ఎంతో ఆసక్తిని కనబరుస్తూ ఉంటాయి. ఐపీఎల్లో పాల్గొనడం వల్ల ఒకవైపు కోట్ల రూపాయలు ఆదాయంతో పాటు ఇంకోవైపు బాగా రాణిస్తే మంచి పేరు ప్రఖ్యాతలు కూడా వస్తాయి.

 మరోవైపు అటు వరల్డ్ క్రికెట్లో ఉన్న అత్యుత్తమ ఆటగాలు అందరితో కూడా డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకొని సరికొత్త అనుభవాన్ని సంపాదించుకునేందుకు అవకాశం ఉంటుంది. అందుకే ఇక అందరూ ప్లేయర్లు కూడా ఐపీఎల్లో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతారు. దీనికోసం కొంతమంది దేశం తరఫున ప్రాతినిధ్యం వహించడానికి కూడా పక్కన పెడుతూ ఉంటారు. అయితే క్రికెట్ సంబంధాలపై నిషేధం కొనసాగుతున్న నేపథ్యంలో అటు పాకిస్తాన్ క్రికెటర్లు మాత్రం ఐపిఎల్ ఆడటానికి వీలు ఉండదు. దీంతో ఐపీఎల్ లో ఆడే ఛాన్స్ వస్తే బాగుందని పాకిస్తాన్ క్రికెటర్లు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు. కానీ ఆ దేశ  మాజీ ఆటగాళ్ళు మాత్రం ఎప్పుడు సొంత డబ్బా కొట్టుకుంటూ ఉంటారు అని చెప్పాలి.

 ఇక ఇటీవల ఇదే విషయంపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ రమీజ్ రజా స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఐపీఎల్ లో 20 కోట్ల రూపాయలు ఇచ్చిన పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజాన్ ఆ టోర్నీలో ఆడరని అంటూ చెప్పుకొచ్చాడు. అతను దేశానికే మొదటి ప్రాధాన్యత ఇస్తాడు అంటూ చెప్పుకొచ్చాడు రమిజ్ రాజా. ఈ క్రమంలోనే అతను చేసిన కామెంట్స్ కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. ఈ క్రమంలోనే ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్అతని వ్యాఖ్యలపై ట్రోల్స్ చేస్తున్నారు. విరాట్ కోహ్లీ లాంటి ఆటగాడికే 15 కోట్లు ఇస్తుంటే ఇక బాబర్ అజాం కి 20 కోట్లు ఇస్తారా అంటూ సెటైర్లు వేస్తున్నారు. చిన్న దేశాలపై తప్ప పెద్ద దేశాలపై బాబర్ ఎప్పుడు మంచి ఇన్నింగ్స్ ఆడలేదు అంటూ గుర్తు చేస్తున్నారు భారత క్రికెట్ ఫ్యాన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: