ఈ సీజన్లో ఫ్యాన్స్ ను తీవ్ర నిరుత్సాహపరిచిన ముంబై జట్టు..?

MADDIBOINA AJAY KUMAR
ఐపీఎల్ సీజన్ ప్రారంభం అయింది అంటే ముంబై ఇండియన్స్ జట్టు తమ అద్భుతమైన ఆట తీరుతో ప్రేక్షకులను తమ జట్టు అభిమానులను ఎంతగానో అలరిస్తూ ఉంటుంది. ఇలా ఈ జట్టు ఎన్నో సీజన్ లలో అద్భుతమైన ప్రదర్శనను కనబరిచి ఎన్నో ఐపిఎల్ ట్రోపీలను సాధించింది. అలా ఐపీఎల్ లో గొప్ప ట్రాక్ రికార్డు కలిగిన ఈ జట్టు ఈ సారి సీజన్ లోకి కూడా ఎన్నో అంచనాల మధ్య అడుగు పెట్టింది. కాకపోతే చాలా సీజన్ లకి ముంబై జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్ గా వ్యవహరిస్తూ వస్తున్నాడు. ఆయన నేతృత్వంలో ఈ జట్టు అద్భుతమైన ఆట తీరని కనబరిచింది.

కానీ ఈ సీజన్ లో రోహిత్ ను కాదు అని చెప్పి హార్దిక్ పాండ్యా ను ముంబై జట్టు కెప్టెన్ గా నియమించింది. దానిపై మొదటి నుండే ముంబై అభిమానులు తీవ్ర నిరుత్సాహంగా ఉన్నారు. దానికి తోడు హార్దిక్ నేతృత్వంలో ముంబై జట్టు కూడా ఈ సారి ఘోరమైన ఆట తీరని కనపరుస్తుంది. ఇక ఇప్పటి వరకు ఈ జట్టు 11 మ్యాచ్ లను ఆడగా అందులో కేవలం 3 మ్యాచ్ లలో మాత్రమే గెలుపొంది 8 మ్యాచ్ లలో ఓడిపోయి 6 పాయింట్ లతో పాయింట్ల పట్టికలో ప్రస్తుతం  చివరి స్థానంలో ఉంది.

గతంలో ఎన్నో ఐపిఎల్ ట్రోఫీలను దక్కించుకున్న ముంబై జట్టు ఈ సీజన్ లో మాత్రం ఘోరమైన ఆట తీరును కనబరిచి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. ఇక మొదటి నుండి ఈ జట్టు పై భారీ అభిమానాన్ని పెంచుకున్న అభిమానులు ఈ సీజన్ లో ఈ జట్టు ఆట తీరుపై తీవ్ర దినోత్సవాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఈ సీజన్లో ముంబై మరికొన్ని మ్యాచ్ లను ఆడనుంది. రాబోయే మ్యాచ్ లలో అయినా ముంబై జట్టు కాస్త మెరుగైన ప్రదర్శనను కనబరిచి తమ జట్టును అభిమానించే వారికి కాస్త ఆనందాన్ని కలిగిస్తుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

ipl

సంబంధిత వార్తలు: