ఐపీఎల్ : తెలుగు కామెంట్రీతో అలరించబోయేది వీళ్ళే?
అయితే ఐపీఎల్ లాంటి ఒక ఉత్కంఠ భరితమైన టోర్నీ జరుగుతుంది అంటే కామెంటేటర్లు ఎంతో కీలకం అన్న విషయం తెలిసిందే. అయితే ఒకప్పుడు హిందీ లేదా ఇంగ్లీషులో మాత్రమే కామెంట్రీ అందుబాటులో ఉండేది. కానీ గత కొంతకాలం నుంచి తెలుగులో కూడా కామెంట్రీ అందుబాటులో ఉండడంతో తెలుగు క్రికెట్ లవర్స్ అందరూ కూడా క్రికెట్ మరింత ఎక్కువగా ఎంజాయ్ చేయగలుగుతున్నారు అని చెప్పాలి. ఇక ఇప్పుడు అటు ఐపీఎల్ ను కూడా తెలుగులో కామెంట్రీ చేసేందుకు కొంతమంది వ్యాఖ్యాతలు సిద్ధమైపోయారు. అయితే ఈసారి ఐపీఎల్ 2024 సీజన్ కు ఎవరు వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తున్నారు అన్నది కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది.
అయితే ఈ ఐపీఎల్ సీజన్ మొత్తాన్ని కూడా జియో సినిమా ఉచితంగా ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు సిద్ధమైంది అన్న విషయం తెలిసిందే. దీంతో ఎలాంటి సబ్ స్క్రిప్షన్ తీసుకోకుండానే అటు క్రికెట్ లవర్స్ అందరూ ఐపీఎల్ ని ఎంజాయ్ చేయబోతున్నారు. ఇకపోతే ఇటీవల ఐపీఎల్ కు సంబంధించిన కామెంటేటర్ల వివరాలను ప్రకటించింది జియో సినిమా. హిందీ, ఇంగ్లీష్ తో పాటు 13 భాషల్లో కూడా ఉచితంగా ప్రత్యక్ష ప్రసారం చూడొచ్చు అంటూ తెలిపింది. దీంతో తెలుగు కామెంటేటర్లు ఎవరు అని తెలుసుకోవడానికి అందరూ ఆసక్తి చెబుతున్నారు. ఆ లిస్టు చూసుకుంటే.. హనుమ విహారి, వెంకటపతి రాజు, అక్షత్ రెడ్డి, ఆశిష్ రెడ్డి, సందీప్ భవనక, కళ్యాణ్ కొల్లారపు, ఆర్జే హేమంత్, ప్రత్యూష, ఆర్జే కౌశిక్, సునీత ఆనంద్ ఇక తెలుగు వ్యాఖ్యాతలుగా వ్యవహరించి ప్రేక్షకులందరినీ కూడా అలరించబోతున్నారు అని చెప్పాలి.