అయ్యో దేవుడా.. ఆ చిన్నారికి ఏం రాత రాసావయ్యా?
ఎందుకంటే అంత సాఫీగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో అనూహ్యమైన ఘటనలు ఎంతో మంది ప్రాణాలను గాల్లో కలిపేస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక కేవలం పెరిగి పెద్దయిన వారు మాత్రమే కాదు ముక్కు పచ్చలారని చిన్నారులు సైతం విధి ఆడిన నాటకంలో ఓడిపోయి చివరికి ప్రాణాలను కోల్పోతూ ఉంటారు. ఇక ఇప్పుడు ఇలాంటి విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. సాధారణంగా అప్పుడే పుట్టిన పిల్లలకు తల్లి చనుబాలు ఎంతో ఆరోగ్యమని వైద్యులు చెబుతూ ఉంటారు. కానీ ఇక్కడ చిన్నారికి మాత్రం తల్లి చనుబాలే చివరికి విషంగా మారి ప్రాణాలు పోవడానికి కారణం అయ్యాయి.
ఉమ్మడి కర్నూలు జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. సిరివెళ్ల మండలం ఎర్రగుంట్లలో ఉండే హిందూమతి అనే 26 ఏళ్ల మహిళలకు మానసిక పరిస్థితి బాగాలేదు. ఆమె ఇటీవలే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది కాగా ఇటీవల హిందూమతి అనే మహిళ తెలియక విషం తాగింది. ఆ తర్వాత బిడ్డ ఏడుస్తుంది అని ఏకంగా బిడ్డకు ఎప్పటిలాగానే తన చనుబాలు ఇచ్చింది. అయితే విషం తాగిన హిందూమతి చనిపోవడంతో పాటు ఇలా తల్లి చనబాలు తాగిన ఆ అభం శుభం చిన్నారి సైతం చివరికి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన కాస్త సంచలనం గా మారిపోయింది అని చెప్పాలి. ఈ ఘటనతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.