రోహిత్ సెంచరీ.. అభిమాని చేసిన పనికి అందరూ ఫిదా?

praveen
ఇండియాలో క్రికెట్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే స్టార్ క్రికెటర్లు అందరిని కూడా ఎంతగానో ఆరాధిస్తూ ఉంటారు ప్రేక్షకులు. క్రికెట్ మ్యాచ్ వస్తుందంటే చాలు ఎన్ని పనులున్నా పక్కన పెట్టేసి టీవీకి అతుక్కుపోతూ ఉంటారు. కొంతమంది ప్రేక్షకులైతే ఎంత ఖర్చు చేసి అయినా సరే సుదూర ప్రాంతాల్లో జరుగుతున్న మ్యాచ్లకు వెళ్లి ప్రత్యక్ష ప్రసారం చూడటానికి ఇష్టపడుతూ ఉంటారు అని చెప్పాలి. ఇక తమ అభిమాన ఆటగాడు క్రికెట్లో మంచి రికార్డులు సాధించాడు అంటే చాలు ప్రేక్షకులు తామే ఆ రికార్డును సాధించాం  అన్న విధంగా సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటారు అని చెప్పాలి.

 అయితే కొన్ని కొన్ని సార్లు ఇలా క్రికెటర్ల అభిమానులు చేసుకునే సెలబ్రేషన్స్ ఇతరులకు ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు రోహిత్ శర్మ అభిమానులు మాత్రం ప్రతి ఒక్కరికి కూడా స్ఫూర్తిగా నిలుస్తూ ఉన్నారు. ఇటీవలే ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మూడో టి20 మ్యాచ్లో రోహిత్ శర్మ అదిరిపోయే ప్రదర్శన చేశాడు అన్న విషయం తెలిసిందే. సూపర్ సెంచరీ తో చెలరేగిపోయాడు. కేవలం 63 బంతుల్లోనే 121 పరుగులు చేశాడు. ఇక జట్టు విజయంలో కీలక పాత్ర వహించి కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు రోహిత్ శర్మ. దీంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అని చెప్పాలి.

 రోహిత్ శర్మ సూపర్ సెంచరీ తో ఇక అతని ఫాన్స్ అందరు కూడా ఫుల్ ఖుషి లో ఉన్నారు. అయితే ఇక ఒక అభిమాని అందరికంటే భిన్నంగా ఇక ఈ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. రోహిత్ సెంచరీ చేసినందుకు అభాగ్యులకు ఆహారం పంపిణీ చేశాడు. న్యూ గాడ్ ఆఫ్ క్రికెట్ రోహిత్ శర్మ అని ముద్రించి రోడ్డు పక్కన ఉండే వృద్ధులు పిల్లలకు ఆహారం అందజేశాడు. దీంతో సదరు అభిమాని చేసిన పని అందరిని ఫిదా చేస్తుంది. కటౌట్లు పెట్టి పాలాభిషేకం చేయడం కాదు ఇలాంటివి చేస్తే ఇక నలుగురికి మంచి జరుగుతుంది అని ఎంతో మంది సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: