కోహ్లీతో మ్యాచ్ కోసం.. ఎంతగానో ఎదురు చూస్తున్నా : జకోవిచ్

praveen
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు. తన ఆట తీరుతో ప్రపంచ వ్యాప్తంగా కూడా గుర్తింపును సంపాదించుకున్నాడు. ఏకంగా కోహ్లీ ఏ మారుమూల ప్రాంతానికి వెళ్లిన అక్కడ తప్పకుండా విరాట్ అభిమానులు కనిపిస్తూనే ఉంటారు. ఇక ఇలాంటి పాపులారిటీ సంపాదించుకున్నాడు కాబట్టి సోషల్ మీడియా లో ఫాలోవర్ల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. మిగతా స్టార్ క్రికెటర్లతో పోల్స్ చూస్తే ఇక ఫాలోవర్ల విషయంలో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు.

 ఇక ఇంత పాపులారిటీ ఉన్న తర్వాత కోహ్లీ గురించి ఏదైనా విషయం సోషల్ మీడియా లోకి వస్తే హాట్ టాపిక్ గా మారిపోకుండా ఎలా ఉంటుంది. కోహ్లీ ఏ చిన్న మాట మాట్లాడినా సోషల్ మీడియా జనాలు అందరూ కూడా ఆసక్తిగా ఆ విషయాన్ని చూస్తూ ఉంటారు అని చెప్పాలి  అయితే ఇటీవల టెన్నిస్ స్టార్ జకోవిచ్ తనకు బెస్ట్ ఫ్రెండ్ అంటూ విరాట్ కోహ్లీ  ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఏకంగా ఇంస్టాగ్రామ్ లో మేము ఎప్పుడూ ఒకరితో ఒకరు మెసేజ్లు చేసుకుంటూనే ఉంటాం అంటూ తెలిపాడు. మొదటిసారి మెసేజ్ చేసినప్పుడు జకోవిచ్ వెంటనే రిప్లై ఇచ్చాడు అంటూ కోహ్లీ తెలిపాడు. అప్పటినుంచి మేము ఫ్రెండ్స్ అయ్యాం అంటూ తెలిపాడు. అయితే డైరెక్ట్ గా ఎప్పుడు కలవలేదని.. ఎప్పుడైనా కలవాలని అనుకుంటున్నాను అంటూ కోహ్లీ చెప్పుకొచ్చాడు.

 అయితే తనతో స్నేహం గురించి విరాట్ కోహ్లీ చెప్పిన మాటలపై స్పందించాడు జకోవిచ్. విరాట్ కోహ్లీకి థాంక్స్ చెప్పాడు. మీరు చెప్పిన మాటలకు ధన్యవాదాలు. మనం కలిసి మ్యాచ్ ఆడే రోజు కోసం ఎదురు చూస్తున్నాను అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు జకోవిచ్. అంతేకాకుండా క్రికెట్ బ్యాట్ బాల్ టెన్నిస్ బంతులను ఏమోజీలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు జకోవిచ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: