లంక క్రికెట్ బోర్డుకి.. ఐసీసీ గుడ్ న్యూస్ చెప్పబోతుందా?
ఏకంగా శ్రీలంక క్రికెట్ బోర్డుపై నిషేధం విధిస్తున్నట్లు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ప్రకటించింది అన్న విషయం తెలిసిందే. అయితే క్రికెట్ బోర్డు వ్యవహారాలలో రాజకీయ నాయకుల జోక్యం ఎక్కువ కావడం కారణంగానే ఇక ఇలా క్రికెట్ బోర్డుపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది ఐసిసి. కాగా బోర్డు అధికారుల విజ్ఞప్తి మేరకే ఇలా బ్యాన్ విధించింది అన్నది తెలుస్తుంది. అయితే ఇలా ఐసీసీ నిషేధం విధించిన నేపథ్యంలో శ్రీలంక క్రికెట్ మరింత సంక్షోభంలో కోరుకుంది. ఇలాంటి సమయంలో మరి కొన్ని రోజుల్లో లంక క్రికెట్ బోర్డుకు ఐసిసి గుడ్ న్యూస్ చెప్పబోతుంది అన్నది తెలుస్తుంది.
శ్రీలంక క్రికెట్ బోర్డుపై విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేసేందుకు ఐసీసీ యోచిస్తుంది అన్నది తెలుస్తుంది. తాజాగా ఐసీసీ బృందం శ్రీలంకలో పర్యటించింది. క్రీడల్లో ప్రభుత్వ జోక్యం లేకుండానే చూస్తామని ప్రధాని విక్రమ సింగే ఐసీసీ సీఈవో జఫ్ అల్లాడిస్ కు హామీ ఇచ్చారు. ఈ నేపద్యంలోనే త్వరలో సస్పెన్షన్ ఎత్తివేత పై నిర్ణయం ఉంటుంది అని తెలుస్తుంది. అయితే వన్డే వరల్డ్ కప్ సమయంలో కూడా సరైన ఆటగాళ్లని జట్టులోకి తీసుకోలేదు అంటూ తీవ్ర స్థాయిల విమర్శలు వచ్చాయి. ఇక జట్టు సెలక్షన్ సరిగ్గా లేకపోవడంతోనే వరల్డ్ కప్ లో లంక జట్టు విఫలమైంది అంటూ అందరూ ఆరోపణలు చేశారు.