ధోనినా మజాకా.. ఏం చేసాడో తెలుసా?
అయితే 2019లో అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ ప్రస్తుతం ఐపీఎల్ లో ఆడుతున్నాడు ధోని. అయితే సాధారణం గా ధోని అటు సోషల్ మీడియా లో పెద్దగా యాక్టివ్ గా ఉండడు.. అసలు మొబైల్ వాడటమే ఎక్కువ కానీ ధోనీకి సంబంధించిన వార్త మాత్రం ఎప్పుడు ఏదో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారి పోయేది. అయితే ఇటీవలే కాలంలో ఇక ధోని క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో స్నేహితులు, కుటుంబంతో కలిసి ఊర్లకు వెళ్తున్నాడు. ఇక ఆ విషయాలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటున్నాడు.
అదే సమయంలో అభిమానుల కోసం ప్రత్యేకంగా సమయం వెచ్చించగలుగుతున్నాడు మహేంద్ర సింగ్ ధోని అయితే ధోని అటు అభిమానులను ఎంతలా గౌరవిస్తాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అభిమానుల కోసం ఏం చేయడానికైనా సిద్ధమవుతాడు. అయితే ఇటీవల ఏకంగా అభిమానికి సర్ ప్రైస్ ఇచ్చాడు ధోని. అభిమాని పుట్టినరోజుకు హాజరై ఆశ్చర్యపరిచాడు. అంతేకాదు కేక్ కట్ చేసేంతవరకు ఉండి అభిమానికి కేక్ తినిపించాడు ధోని. అయితే మహిబాయ్ నుంచి ఇలాంటి సర్ ప్రైస్ అసలు ఊహించలేదు అంటూ సదరు అభిమాని ఆనందంతో ఉబ్బితబ్బిబైపోయాడు.