అతని కోసం అన్ని కోట్లు అవసరమా.. RCB పై ఫ్యాన్స్ ఆగ్రహం?

praveen
ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలో ఛాంపియన్ టీమ్స్ ఏవి అంటే ముంబై ఇండియన్స్ తో పాటు చెన్నై సూపర్ కింగ్స్ జట్ల పేరు చెబుతూ ఉంటారు క్రికెట్ ప్రేక్షకులు. అయితే ఇక ఐదుసార్లు టైటిల్స్ గెలిచిన ఈ రెండు టీమ్స్ కి అటు సోషల్ మీడియాలో ఫాలోవర్ల సంఖ్య కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. అయితే ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ గెలవలేకపోయినప్పటికీ.. ఇక ఈ రెండు టైమ్స్ తో పాటుగానే అభిమానులను సంపాదించుకున్న జట్టు ఏదైనా ఉంది అంటే అది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు అని చెప్పాలి. ప్రతి సీజన్లో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగే బెంగళూరు టీం.. ఇక కీలకమైన మ్యాచులలో చేతులెత్తేసి నిరాశ పరుస్తూ ఉంటుంది.

 జట్టులో స్టార్ ప్లేయర్లు లేక ఇలా తడబడుతుంది అనుకుంటే పొరపాటే. ఎందుకంటే అంతర్జాతీయ క్రికెట్లో ఉండే మహా మహా ప్లేయర్లు అందరూ కూడా ఆర్సిబి టీమ్ లోనే కనిపిస్తూ ఉంటారు. కానీ ఎందుకో ఆ జట్టుకు అదృష్టం అసలు కలిసి రావడం లేదు. గత ఏడాది కాస్త పటిష్టంగా కనిపించినప్పటికీ కీలకమైన మ్యాచ్లలో చేతులెత్తేసి మళ్ళీ టైటిల్ రేస్ లో వెనుకబడిపోయింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. ఈ క్రమంలోనే 2024 ఐపీఎల్ సీజన్ కోసం అయినా పకడ్బందీ ప్లాన్స్ తో బరిలోకి దిగుతుందని అందరూ ఊహించారు.

 ఇక వేలంలో మంచి ప్రతిభ గల ప్లేయర్లను జట్టులోకి తీసుకుంటుందని అనుకున్నారు. వెస్టిండీస్ స్టార్ ఫేసర్ ఆల్జారి జోసెఫ్ కోసం ఏకంగా 11.50 కోట్ల రూపాయలు ఖర్చు చేసి జట్టులోకి తీసుకుంది బెంగళూరు ఫ్రాంచైజీ. ఇక ఈ విషయంపై అభిమానులు మాత్రం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే బౌలింగ్ లైనప్ సరిగ్గా లేక ఇబ్బంది పడుతున్న ఆర్సిబి టీం.. మళ్లీ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు ఫ్యాన్స్. అల్జారి జోసెఫ్ లాంటి బౌలర్ పై అంత పెద్ద మొత్తంలో వెచ్చించాల్సిన అవసరం ఏముంది అంటూ ప్రశ్నిస్తున్నారు. ఆర్సిబి ఏకంగా ఫ్యాన్స్ ను నిరాశపరచడమే పనిగా పెట్టుకుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: