క్రికెట్ లో కొత్త రూల్.. అలా చేస్తే 5 పరుగుల పెనాల్టీ?

praveen
ప్రపంచ దేశాలలో క్రికెట్కు ఉన్న ఆదరణ రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎన్నో దేశాలు అటు అంతర్జాతీయ క్రికెట్లో రాణించాలని ఎంతగానో ఆశపడుతున్నాయి. అయితే ఇక క్రికెట్ ప్రేక్షకులు అందరికీ కూడా అటు నాణ్యమైన క్రికెట్ అందించడమే లక్ష్యంగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కూడా సరికొత్త టెక్నాలజీని క్రికెట్ ఆటలో అందుబాటులోకి తీసుకోవచ్చింది. దీంతో ఫీల్డ్ అంపైర్లు  ప్రతి నిర్ణయానికి కూడా ఎంతో కచ్చితత్వంతో తీసుకోగలుగుతున్నారు అని చెప్పాలి. అయితే ఇక ఎప్పటికప్పుడు క్రికెట్ రూల్స్ ని మారుస్తూ వస్తూ ఉంటుంది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్.

 ఈ క్రమంలోని ప్రస్తుతం క్రికెట్లో ఐసీసీ కొత్త రూల్ ప్రవేశపెట్టింది అన్నది తెలుస్తుంది. సాధారణంగా మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఒక ఓవర్ పూర్తయిన తర్వాత మరో బౌలర్ తో బంతులు వేయించడానికి కెప్టెన్ కాస్త ఎక్కువ సమయం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఎంత సమయంలోపు మరో బౌలర్ బంతిని సంధించాలి అనే విషయంపై ఇప్పటివరకు ఎలాంటి నిబంధన లేదు అని చెప్పాలి. దీంతో కొన్ని కొన్ని సార్లు ఇలా బౌలింగ్ చేసే సమయంలో ఆయా జట్లు సుదీర్ఘ సమయం తీసుకుంటూ ఉంటాయ్. దీంతో మ్యాచ్ లు ఆలస్యంగా ముగుస్తున్న పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం.

 ఇలాంటి పోకడకు స్వస్తి పలికేందుకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఏకంగా మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఎక్కడా సమయం వృధా కాకుండా ఉండేందుకు సరికొత్త రూల్ను తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలోనే స్టాప్ క్లాక్ తో ఓవర్ల మధ్య వ్యవధిని  నియంత్రించే విధానాన్ని ఐసిసి పరిగణిస్తుంది. అయితే బౌలింగ్ టీం మూడుసార్లు 60 సెకండ్లలో తర్వాత ఓవర్ ప్రారంభించకా పోతే.. అయితే ఏకంగా ఐదు పరుగులను పెనాల్టీ విధిస్తారు అంపైర్లు . ఈ డిసెంబర్ నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు కూడా ఈ కొత్త రోల్ ని ప్రయోగాత్మకంగా ఐసిసి క్రికెట్లో ప్రవేశ పెట్టేందుకు  సిద్ధమైంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: