వాంఖడేలో టాస్ ఎంతో కీలకం.. ఎందుకో తెలుసా?

praveen
ఎన్నో రోజుల నుంచి ఇండియా వేదికగా జరుగుతూన్న వరల్డ్ కప్ టోర్ని ప్రేక్షకులు అందరికీ అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ పంచింది. వరల్డ్ కప్ పోరు ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది అని చెప్పాలి. ఈ వరల్డ్ కప్ లో భాగంగా చాలా టీమ్స్ సెమీఫైనల్ లో అడుగు పెట్టాలని ప్రయత్నించినప్పటికీ.. కేవలం భారత్, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లకు మాత్రమే సెమిస్లో అవకాశం దొరికింది అని చెప్పాలి.


 ఈ నాలుగు టీమ్స్ మధ్య సెమీఫైనల్ పోరు హోరాహోరీగా జరగబోతుంది. రేపు మొదటి సెమి ఫైనల్ మ్యాచ్ జరగబోతుందన్న  విషయం తెలిసిందే. అయితే న్యూజిలాండ్, టీమిండియా ఎప్పుడు తలబడిన కూడా ఆ మ్యాచ్ ఎంతో ఆసక్తికరంగా మారిపోతుంది. అదే సమయంలో 2019 వరల్డ్ కప్ లో సెమి ఫైనల్ లోనే న్యూజిలాండ్ టీం ఇండియాని ఓడించి ఇంటికి పంపింది. ఇక ఇప్పుడు ఏం జరగబోతుందో అనే విషయం గురించి అందరికీ చర్చించుకుంటున్నారు.  ఈ క్రమంలోనే మ్యాచ్ వేదిక.. గత రికార్డులు ఇలా అన్నీ కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్  మారిపోతున్నాయి.


 అయితే ఇక ఈ సెమీఫైనల్ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగబోతూ ఉండగా.. ఈ మ్యాచ్లో టాస్ ఎంతో కీలకం అన్నది గత రికార్డులు చెబుతున్నాయ్. ఎందుకంటే ఈ స్టేడియంలో తొలిత బ్యాటింగ్ చేసిన జట్లే భారీ స్కోర్ చేసి ఎక్కువసార్లు విజయం సాధించాయ్. ఇదే వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ పై సౌతాఫ్రికా 399 పరుగులు చేసి ఇక 229 పరుగులతో గెలిచింది. ఇక ఆ తర్వాత అదే సౌత్ ఆఫ్రికా బంగ్లాదేశ్ పై 382 పరుగులు చేసి 149 పరుగులు తేడాతో విజయం సాధించింది. శ్రీలంకపై ఇండియా 357 రన్స్ చేసి 302 రన్స్ తేడాతో విజయం సాధించింది. దీంతో ఇక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడమే ఎంతో కీలకం అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Icc

సంబంధిత వార్తలు: