సెంచరీ కాదు.. 35 రన్స్ వద్దే.. కోహ్లీ అరుదైన రికార్డ్?
ఇక ప్రతి మ్యాచ్ లో కూడా అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుంటూ అదరగొడుతూ ఉంటాడు కోహ్లీ. అయితే మొన్నటి వరకు మూడేళ్ల పాటు ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడిన కోహ్లీ.. మళ్ళీ సెంచరీల వేట ప్రారంభించాడు. ఇక చాన్స్ దొరికితే చాలు సెంచరీ చేసేస్తూ ఎన్నో అరుదైన రికార్డులను బద్దలు కొడుతూ తన పేరును లికించుకుంటున్నాడు అని చెప్పాలి. అయితే ఇటీవల వరల్డ్ కప్ లో భాగంగా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో కూడా విరాట్ కోహ్లీ సెంచరీ తో చెలరేగిపోయాడు. ఈ క్రమంలోనే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కూడా అందుకున్నాడు అని చెప్పాలి.
అయితే విరాట్ కోహ్లీ సెంచరీ చేయడం కాదు.. కేవలం 35 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఒక అరుదైన రికార్డును కూడా సృష్టించాడు విరాట్ కోహ్లీ. ఇంటర్నేషనల్ క్రికెట్లో 25957 పరుగులు సాధించి శ్రీలంక క్రికెట్ లెజెండ్ అయినా జయవర్ధనే రికార్డును బద్దలు కొట్టి అతని వెనక్కి నెట్టాడు. జయవర్తనే 725 ఇన్నింగ్స్ లలో 25957 పరుగులు చేశాడు. అయితే విరాట్ కోహ్లీ కేవలం 567 ఇన్నింగ్స్ లోనే 25 వేల 960 పరుగులు సాధించాడు అని చెప్పాలి. ఇక ఈ లిస్టులో టాప్లో సచిన్ టెండూల్కర్ 34,357 పరుగులతో ఉన్నాడు. కుమార సంగకర 28016 పరుగులు, రికీ పాంటింగ్ 27,468 పరుగులతో కోహ్లీ కంటే ముందున్నారు.