ఆ విషయం తెలియగానే.. మా నాన్న ఏడ్చేశారు : జైష్వాల్

praveen
ప్రతి ఏడాది భారత క్రికెట్ నియంత్రణ మండలి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనేది అటు భారత జట్టుకు భవిష్యత్తు స్టార్స్ అందించే ఒక అద్భుతమైన టోర్నిగా మారిపోయింది అని చెప్పాలి. ప్రస్తుతం టీమిండియాలో స్టార్ ప్లేయర్స్ గా కొనసాగుతున్న వారు ఒకప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో రాణించి  భారత జట్టులో చోటు దక్కించుకున్న వారే. ఇక  ఇప్పుడు ఎంతోమంది యంగ్ ప్లేయర్స్ కూడా టీమ్ ఇండియాలో ఛాన్స్ కోసం ఇక ఐపీఎల్లో బాగా రాణించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అని చెప్పాలి.

 అయితే 2023 ఐపీఎల్ సీజన్లో మంచి ప్రదర్శన చేసి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించిన కొంతమంది యంగ్ క్రికెటర్లు ఇక టీమిండియా మరికొన్ని రోజుల్లో వెళ్ళబోయే వెస్టిండీస్ పర్యటనలో భాగంగా టీమిండియాలో ఛాన్స్ దక్కించుకున్నారు అని చెప్పాలి. ఇక ఇలా ఛాన్స్ దక్కించుకున్న ప్లేయర్లలో యంగ్ సెన్సేషన్ యశస్వి జైష్వాల్  కూడా ఒకరు అని చెప్పాలి. ఇప్పటికే దేశవాళీ క్రికెట్లో సెంచరీ ల మోత మోగించి తన సత్తా ఏంటో చూపించిన యశస్వి జైస్వాల్.. ఇక 2023 ఐపీఎల్ సీజన్లోనూ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. రాజస్థాన్ తరపున ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్ లు ఆడాడు అని చెప్పాలి.

 ఈ క్రమం లోనే సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించి.. ఇక ఇప్పుడు వెస్టిండీస్ తో జరగబోయే టెస్టు సీరియస్ కు ఎంపిక అయ్యాడు యశస్వి జైస్వాల్. ఇక ఈ విషయం గురించి ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వెస్టిండీస్తో టెస్ట్ సిరీస్ కు భారత జట్టులో ఎంపికైనట్లు తెలియగానే తన తండ్రి ఏడ్చేసాడు అంటూ జైష్వాల్ చెప్పుకొచ్చాడు. టీమిండియాలో చోటు దక్కినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. సిరీస్ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్న... తప్పకుండా బాగా ఆడి జట్టును గెలిపించేందుకు ప్రయత్నిస్తా అంటూ జైష్వాల్ తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: