నెటిజన్ కి దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన అశ్విన్.. ఏమన్నాడంటే?

praveen
సాధారణంగా క్రికెటర్లకు సోషల్ మీడియాలో కాస్త ఎక్కువగానే పాపులారిటీ ఉంటుంది అన్న విషయం తెలిసిందే . ఈ క్రమంలోనే క్రికెటర్లకు సంబంధించిన ఏ విషయం అయినా సరే కేవలం నిమిషాల వ్యవధిలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది. అయితే క్రికెటర్లు ఇక మ్యాచ్ లో బాగా రాణించినప్పుడు ఇక నేటజన్స్ అందరూ పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటారు. అదే సమయంలో ఎక్కడైనా పేలవ ప్రదర్శన చేసి నిరాశపరిచారు అంటే ఇక అప్పటివరకు చేసిన మంచి ప్రదర్శనల గురించి మరిచిపోయి దారుణంగా తిట్టిపోవడం కూడా సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాము అన్న విషయం తెలిసిందే.

 ఇలా వరుస వైఫల్యాలతో ఇబ్బంది పడుతున్న క్రికెటర్ల పై ఎప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తూనే ఉంటాయి. అయితే అటు క్రికెటర్లు మాత్రం ఇలా తమపై వస్తున్న విమర్శలను పట్టించుకోకుండా ఆట మీద దృష్టి పెడుతూ ముందుకు సాగుతూ ఉంటారు అని చెప్పాలి. అయితే కొన్ని కొన్ని సార్లు ఇక సోషల్ మీడియాలో నెటిజెన్స్ చేసే ట్రోల్స్ క్రికెటర్లను సైతం హర్ట్ అయ్యేలా చేస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఇకపోతే ఇటీవల బంగ్లాదేశ్ పై భారత జట్టు విజయం సాధించి ఇక టెస్ట్ సిరీస్ ను క్లీన్ స్వీట్ చేసింది అన్న విషయం తెలిసిందే. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజ్ లోకి వచ్చిన స్పిన్నర్ అశ్విన్ తన బ్యాటింగ్ తో అదరగొట్టి జట్టుకు విజయాన్ని అందించాడు.

 అయితే బంగ్లాదేశ్ తో రెండో టెస్టులో కీలక ఇన్నింగ్స్ ఆడిన అశ్విన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.  కాగా ఈ అవార్డు బంగ్లాదేశ్ ఆటగాడు ఇమాముల్ హక్ కి ఇవ్వాలని అతను క్యాచ్ వదిలేయడం వల్లే  ఇండియా గెలిచిందంటూ ఒక నేటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టగా ఇది చూసిన అశ్విన్ కు చిర్రెత్తుకొచ్చింది. దీంతో ఘాటు రిప్లై ఇచ్చాడు. నిన్ను బ్లాక్ చేశాను అనుకున్న.. కానీ అతను మరో వ్యక్తి అనుకుంటా.. ఒకవేళ భారత్ క్రికెట్ ఆడకుంటే మీరిద్దరూ ఏం చేసేవారో పాపం అంటూ తనదైన శైలిలో ఇక నెటిజన్కు ఘాటు రిప్లై ఇచ్చాడు రవిచంద్రన్ అశ్విన్. ఇక ఇది తెలిసిన ఎంతోమంది అభిమానులు అశ్విన్ నెటిజన్ కు సరైన కౌంటర్ ఇచ్చాడు అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: