ఇక బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ మునుపటిలా సూపర్ గా ఒక రేంజిలో విజృంభించాడు. ఈ యంగ్ బ్యాట్స్ మెన్ కేవలం 104 బంతుల్లోనే ఏకంగా 93 పరుగులు చేశాడు.ఇందులో మొత్తం 7 ఫోర్లు ఇంకా 5 సిక్సర్లు ఉన్నాయి. కానీ భారీ షాట్ కొట్టే ప్రయత్నంలో మరోసారి రిషబ్ తన సెంచరీని కోల్పోవడం జరిగింది. బంగ్లాదేశ్ బౌలర్ అయిన మెహదీ హసన్ మిరాజ్ 93 పరుగుల వద్ద రిషబ్ పంత్ను అవుట్ చేసి పెవిలియన్కు పంపాడు. అందువల్ల రిషబ్ పంత్ సెంచురి చేయకుండానే వెనుదిరిగాడు. ఇక రిషబ్ పంత్ కి తొంభైల్లో అవుట్ కావడం ఈ ఏడాది మూడోసారి కాగా… మొత్తం మీద ఇది ఆరోసారి. అయితే తాను ఉన్నంతసేపు కూడా బంగ్లా బౌలర్లను ఊచకోత కూయించి గడగడలాడించాడు రిషబ్ పంత్. ముఖ్యంగా మూడో సెషన్లో బంగ్లా బౌలర్లపై తను పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. ఫస్ట్ 49 బంతుల్లో ఏకంగా 50 పరుగులు పూర్తి చేశాడు. ఆ తర్వాత రిషబ్ పంత్ మరింత దూకుడుగా ఆడటం జరిగింది. ఇంకా ఈ టీ20 మ్యాచ్ తరహాలో చేలరేగిన రిషబ్ పంత్ ఒంటిచేత్తో సూపర్ సిక్సర్లు కొట్టి టీమిండియా స్కోరును మరింత వేగంగా ముందుకు కదిలించాడు.
ముఖ్యంగా 48వ ఓవర్లో రిషబ్ కొట్టిన102 మీటర్ల భారీ సిక్స్ అయితే ఏకంగా మ్యాచ్కే హైలెట్గా నిలిచింది.ఇక తైజుల్ వేసిన ఆ ఓవర్ రెండో బంతిని మిడ్వికెట్ దిశగా స్ట్రెయిట్ గా స్టాండ్స్లోకి పంపాడు రిషబ్ పంత్. ఆతర్వాత షకీబ్ ఓవర్లోనూ మరో సిక్స్ కొట్టాడు.ఇలా తాను ఉన్నంత సేపు కూడా బంగ్లా బౌలర్లపై విరుచుకుపడిన రిషబ్ పంత్ సెంచరీ చేస్తాడని అందరూ కూడా భావించారు. కానీ భారీ షాట్కు ట్రై చేసి ఔటై ఫ్యాన్స్ను బాగా నిరాశపర్చాడు.ఇక ఈ మ్యాచ్ విషయానికొస్తే..ఫస్ట్ ఇన్నింగ్స్లో టీమిండియా మొత్తం 314 పరుగులకు ఆలౌటౌంది.రిషబ్ పంత్తో పాటు శ్రేయస్ అయ్యర్ (87) కూడా సూపర్ గా రాణించాడు. అయితే వీరిద్దరు తప్ప మరే బ్యాటర్లు కూడా పెద్దగా స్కోరు చేయలేదు. దీంతో టీమిండియా జట్టు కేవలం నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. అయితే ఫస్ట్ ఇన్నింగ్స్లో టీమిండియాకు 87 పరుగుల స్పల్ప ఆధిక్యం లభించింది. బంగ్లా బౌలర్లలో చూసినట్లయితే.. షకీబ్, తైజుల్ ఇస్లామ్ చెరో 4 వికెట్లు పడగొట్టడం జరిగింది.