అందుకే షమీకి ఆఖరి ఓవర్ ఇచ్చాను : రోహిత్
ఇక ఇటీవల టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఇలాంటిదే చేసి అభిమానులను ఆశ్చర్యపరిచాడు. మరికొన్ని రోజుల్లో టీమిండియా టి20 వరల్డ్ కప్ ప్రస్థానాన్ని మొదలు పెట్టబోతుంది. ఇక అంతకు ముందుగానే ఇక ప్రస్తుతం ప్రాక్టీస్ మ్యాచ్లలో టీమిండియా మునిగి తేలుతోంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల అటు ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టుతో వార్మప్ మ్యాచ్ ఆడింది. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్ ఎంత ఉత్కంఠ భరితంగా జరిగింది అని చెప్పాలి. ఆస్ట్రేలియా గెలవాలంటే ఆఖరి ఓవర్లో 11 పరుగులు కావాలి.
ఇలాంటి సమయంలో ఎంతో ఉత్కంఠ భరితంగా మ్యాచ్ జరుగుతుండగా రోహిత్ శర్మ మాత్రం ఎవరూ ఊహించని విధంగా అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నాడు. ఏడాది కాలం తర్వాత టి20 జట్టులోకి వచ్చిన మహమ్మద్ షమీతో అప్పటివరకు ఒక్క ఓవర్ కూడా వేయించని రోహిత్ ఇక చివరి ఓవర్ అతనికి ఇచ్చాడు. ఈ క్రమంలోనే షమీ సక్సెస్ అయ్యాడు అయితే చివరి ఓవర్ అతనికి ఇవ్వడం పై స్పందించాడు రోహిత్ శర్మ. అయితే ముందుగానే అతనికి ఒక ఓవర్ వేసే అవకాశం ఇవ్వాలి అనుకున్నాము. అది కూడా సవాలుతో కూడుకున్నదైతే బాగుంటుంది అని భావించాం. అందుకే అతనితో ఆఖరి ఓవర్ వేయించాం. ఇక అతను ఏం చేశాడో అందరూ చూశారు అంటూ రోహిత్ చెప్పుకొచ్చాడు.