హర్మన్ ప్రీత్ కౌర్ అరుదైన రికార్డ్.. తొలి మహిళా క్రికెటర్?
ఒకవైపు కెప్టెన్ హార్మన్ ప్రీత్ కౌర్ తనదైన వ్యూహాలతో జట్టును ముందుకు నడిపిస్తూ ప్రత్యర్థిని దెబ్బకొడుతూ ఉంటే.. మరోవైపు జట్టులోని ప్లేయర్లు అందరూ కూడా సమిష్టిగా రానించి జట్టు విజయంలో కీలక పాత్ర వహిస్తున్నారు అని చెప్పాలి. ఇక భారత మహిళా క్రికెట్లో ఉన్న ఎంతో మంది ప్లేయర్లు అంతర్జాతీయ క్రికెట్ లో ఎన్నో అరుదైన రికార్డులు కూడా సొంతం చేసుకుంటూ ఉండడం గమనార్హం. ఇకపోతే టీమిండియా మహిళల జట్టు కెప్టెన్ హార్మోన్ ప్రీత్ కవర్ ఒక అరుదైన రికార్డు సృష్టించింది.
ఇటీవలే ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును సొంతం చేసుకుంది భారత మహిళా జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్. ఇక ఆమె ఈ అరుదైన గౌరవాన్ని దక్కించుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. అయితే ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు అందుకున్న తొలి భారతీయ మహిళా క్రికెటర్ గా అరుదైన ఘనత సాధించింది హర్మన్ ప్రీత్ కౌర్. ఇటీవల ఇంగ్లాండుతో జరిగిన 3 వన్డే మ్యాచ్ల సిరీస్లో కెప్టెన్ గా మాత్రమే కాకుండా బ్యాట్స్మెన్ గా కూడా అద్భుత ప్రదర్శన చేసి సిరీస్ గెలవడంలో కీలక పాత్ర వహించింది. 1999 తర్వాత ఇంగ్లాండ్ గడ్డపై ఇంగ్లాండ్ జట్టును ఓడించడం మొదటిసారి అని చెప్పాలి.