రాంచరణ్, బుచ్చిబాబు సినిమాకు దెబ్బకొట్టేలా వున్నా "బైసన్ "ఫస్ట్ లుక్..!!
ఈ చిత్రానికి పరియేరుమ్ పెరుమాళ్, కర్ణన్, మామన్నన్ చిత్రాల ఫేమ్ మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించనున్నారు.. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను అనౌన్స్ చేసి చాలా రోజులైంది. తర్వాత అంతా సైలెంట్గా ఉండటంతో ఈ చిత్రం అటకెక్కిందనే ప్రచారం కూడా జరిగింది. అలాంటిది ఈ చిత్రం తాజాగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి షాక్ ఇచ్చారు. కబడ్డీ నేపథ్యంలో లో రూపోందుతున్న ఈ సినిమా కోసం దృవ్ ప్రత్యేక శిక్షణ పొందుతున్నాడు..ఈ సినిమాలో హీరోకు జోడిగా మల్లు బ్యూటీ దర్శనా రాజేంద్రన్ నటించనున్నారు. ఈమె ఇప్పటికే తమిళంలో కవన్, ఇరుంబు తిరై వంటి చిత్రాలలో నటించడం గమనార్హం. ఈ చిత్రం కంటిన్యూ షెడ్యూల్ త్వరలోనే ప్రారంభించనున్నట్లు సమాచారం. తూత్తుకుడిలో ప్రారంభించి 80 రోజులలో షూటింగ్ను పూర్తి చేసెయ్యాలని డైరెక్టర్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది..కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ అభిమానులతోపాటు మూవీ లవర్స్ను ఎంటర్టైన్ చేసే పనిలో ఫుల్ బిజీగా ఉన్నాడని తెలిసిందే. ఇక ధ్రువ్ విక్రమ్ తండ్రి బాటలోనే పయనిస్తూ కొత్త ప్రయోగాలతో సినిమాలు చేస్తున్నాడు యాక్టర్. ఈ యువ నటుడి కాంపౌండ్ నుంచి స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో వస్తున్న తాజా చిత్రానికి బైసన్ టైటిల్ ఫైనల్ చేశారు.బీసన్ టైటిల్ లుక్ చూస్తే.... బ్యాక్ డ్రాప్లో అడవిదున్న కనిపిస్తుండగా.. దాని ముందు కండలు తిరిగిన దేహంతో రన్నింగ్కు రెడీ అన్నట్టుగా ఉన్న స్టిల్ ఇప్పుడు నెట్టింటిని షేక్ చేస్తోంది. ఈ మూవీని మారి సెల్వరాజ్ డైరెక్ట్ చేస్తున్నాడు. మారి సెల్వరాజ్ ఇలా తొలిసారి ఇంగ్లీష్లో టైటిల్ పెట్టడం విశేషం. ధ్రువ్ విక్రమ్ ఈ సారి ఏదో గట్టిగానే ప్లాన్ చేశారని తాజా లుక్ చెప్పకనే చెబుతోందంటున్నారు అభిమానులు.
హీరో ధృవ్ విషయానికి వస్తే....ఆదిత్య వర్మ అనే సినిమాతో లాంచ్ అయ్యాడు. తెలుగు అర్జున్ రెడ్డి కు రీమేక్ గా వచ్చిన ఆ సినిమా అనుకున్న హిట్ ను అందుకోలేదు.. . ఆ తర్వాత తన తండ్రితో కలిసి మహాన్ చిత్రంలో నటించారు.. ఈ సినిమా నేరుగా ఓటీటీలో విడుదల కావడంతో హీరోగా పెద్దగా సక్సెస్ కాలేక పోయాడు.. దాంతో ధ్రువ్ విక్రమ్ ఇప్పుడు సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకు రెండు సినిమాలు చేసిన ఈ యంగ్ హీరోకు నటుడిగా మంచి గుర్తింపు వచ్చినా.. రావాల్సినంత క్రేజ్ అయితే రాలేదు. అందుకే కమర్షియల్ స్టార్గా ప్రూవ్ చేసుకునే ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నారు జూనియర్ చియాన్ ఇప్పుడు సినిమాలకు కాస్త గ్యాప్ తీసుకొని ఈ కొత్త సినిమాతో రాబోతున్నాడు..ఇక రామ్ చరణ్ ,బుచ్చిబాబు సినిమా విషయానికి వస్తే... దీనికి ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తుండటం విశేషం. ఉప్పెన మూవీతో బుచ్చిబాబు సంచలనం సృష్టించాడు. ఈ మూవీ గతేడాది ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నేషనల్ అవార్డు కూడా అందుకుంది. ఈ నేపథ్యంలో అతడు చరణ్ కోసం ఎలాంటి కథ రాశాడు? అతన్ని ఎలా చూపించబోతున్నాడన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొని ఉంది.ఈ మాస్ ఎంటర్టైనర్కు 'పెద్ది' (#RC16) అనే పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. గతంలో ఈ టైటిల్ను ఎన్టీఆర్ సినిమా కోసం బుచ్చిబాబు రిజిస్టర్ చేశారని.. ఇప్పుడు అదే పేరును రామ్ చరణ్ సినిమాకు పెడుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఇందులో విలన్గా కనిపించనున్నట్లు సమాచారం.ప్రస్తుతం రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్'తో బిజీగా ఉన్నారు. శంకర్ దర్శకత్వంలో పొలిటికల్, యాక్షన్ నేపథ్యంలో సాగే పవర్ఫుల్ కథాంశంతో ఇది సిద్ధమవుతోంది. కియారా అడ్వాణీ హీరోయిన్. దీని షూటింగ్ వైజాగ్లో జరుగుతోంది. ఇందులో అంజలి, శ్రీకాంత్, సునీల్, ఎస్.జె.సూర్య, సముద్రఖని, నవీన్ చంద్ర తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.