క్రికెట్ దేవుడు సచిన్ రికార్డును బద్దలు కొట్టిన శుబ్ మాన్ గిల్ !

VAMSI
ఈ రోజు హరారే వేదికగా ఇండియా మరియు జింబాబ్వే జట్ల మధ్యన ఈ సిరీస్ లో చివరిదైన మూడవ వన్ డే జరుగుతోంది. ఈ సిరీస్ లో కెప్టెన్ గా ఉన్న కె ఎల్ రాహుల్ మొదటి రెండు మ్యాచ్ లలో చేసిన తప్పును ఈ మ్యాచ్ లో చేయలేదు. ఈ సిరీస్ లో ఒక్కసారి కూడా రాహుల్ టాస్ ఓడిపోకపోవడం గమనార్హం. అయితే మొదటి రెండు వన్ డే లలో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుని విమర్శల పాలయ్యాడు. కానీ ఈ మ్యాచ్ లో మాత్రం మొదట బ్యాటింగ్ తీసుకున్నాడు. అయితే ఒక బ్యాట్స్మన్ గా రాహుల్ మాత్రం వచ్చిన మంచి అవకాశాన్ని మరోసారి జారవిడుచుకున్నాడు. కేవలం 30 పరుగులు చేసి వికెట్ ను ఇచ్చేశాడు.

ఇక మరో ఓపెనర్ శిఖర్ ధావన్ సైతం 40 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఈ స్థితిలో శుబ్ మాన్ గిల్ మరియు ఇషాన్ కిషన్ లు మూడవ వికెట్ కు 140 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇషాన్ కిషన్ సైతం అర్ద సెంచరీ సాధించిన అనంతరం రన్ అవుట్ గా వెనుతిరిగాడు. ఈ మ్యాచ్ లో చివరి ఓవర్ కు క్రీజులో నిలబడి అద్బుతమయిన సెంచరీని చేశాడు. ఇప్పుడిప్పుడే కెరీర్ లో ముందుకు పోతున్న గిల్ జింబాబ్వే పైన సెంచరీ చేయడమే కాకుండా అత్యధిక పరుగులు చేసిన మొదటి బ్యాట్స్మన్ గా రికార్డు సృష్టించాడు. ఈ దశలో ఇంతకు ముందు జింబాబ్వే మీద జింబాబ్వే లో క్రికెట్ దేవుడు అని మనము అంతా అభిమానించే సచిన్ టెండూల్కర్ 127 పరుగుల రికార్డును శుబ్ మాన్ గిల్ 130 పరుగులు చేసి అధిగమించాడు.

ఇతను ఈ స్కోర్ ను కేవలం 97 బంతులు ఆడి సాధించాడు. మొత్తం 15 ఫోర్లు మరియు 1 సిక్సర్ సాధించి భారత అభిమానులు గర్వపడేలా చేశాడు. ఇక ఈ మ్యాచ్ లో టీం ఇండియా నిర్ణీత ఓవర్ లలో 8 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసి కష్టమైన లక్ష్యాన్ని జింబాబ్వే ముందు ఉంచింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: