నాటు వైద్యం చేయించుకుంటున్న ధోని.. అసలేం జరిగింది?
కానీ మహేంద్ర సింగ్ ధోనీ మాత్రం అందరి కంటే కాస్త డిఫరెంట్ కదా ఇక వైద్యం విషయంలో కూడా అలాగే డిఫరెంట్ గా ఆలోచించాడు. ప్రపంచంలో బెస్ట్ హాస్పిటల్ కి వెళ్ళకుండా.. రాంచీలోని ఓ మారు మూల గ్రామంలో నాటు వైద్యం చేయించుకుంటున్నాడు. గత కొంతకాలం నుంచి రెండు కాళ్ల మోకాలి నొప్పితో బాధపడుతున్న ధోని.. నాటు వైద్యం కోసం రాంచి నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాటు వైద్యుడు వందనన్ సింగ్ వద్దకు వెళ్తున్నాడట ధోని. వనమూలికలతో చేసిన మందులు తాగుతున్నాడు ధోని.
నాటువైద్యం కదా ఇక అక్కడ ఎక్కువ ఖర్చు అవ్వదు అనుకుంటున్నారేమో అలా అనుకున్నారంటే మాత్రం పొరపాటే. ఏకంగా ధోని తాగుతున్న వనమూలికలతో కూడిన నాటువైద్యం ఒక్కో డోస్ కి ఏకంగా 40 వేల రూపాయలట. ఇక గతంలో ధోని తల్లిదండ్రులు కూడా అతని వద్ద నాటు వైద్యం చేయించుకున్నారట. ఇక వారికి మోకాళ్లు నొప్పులు నయం కావడంతో.. ఇప్పుడు మహేంద్ర సింగ్ ధోనీ కూడా అతని వద్దకు వెళ్తున్నాడు అని తెలుస్తుంది. అయితే ధోనీ తన దగ్గరికి ఒక సాధారణ వ్యక్తిలా వచ్చి సమస్యని చెప్పినప్పుడు నేను గుర్తించలేకపోయా.. పక్కనే ఉన్న కొంతమంది కుర్రాళ్లు ధోని ధోని అంటూ అరవడంతో అతను ధోని అన్న విషయం తెలిసింది అంటూ సదరు నాటు వైద్యుడు చెప్పుకొచ్చాడు.