దంచికొట్టిన బట్లర్.. కానీ అంతలోనే?
ఇలా అద్భుతమైన ప్రస్థానం కొనసాగిస్తున్న జోస్ బట్లర్ విరాట్ కోహ్లీ 4 సెంచరీల రికార్డును అధిగమించడం ఖాయం అని అందరూ అనుకుంటున్నారూ. ఈ క్రమంలోనే జోస్ బట్లర్ బ్యాట్ నుంచి మరో సెంచరీ ఎప్పుడు వస్తుందా అని ప్రతి మ్యాచ్లో కూడా ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఇటీవల రాజస్థాన్ రాయల్స్ జట్టు పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ ఆడింది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్లో ఎప్పటిలాగానే ఓపెనర్గా బరిలోకి దిగాడు జోస్ బట్లర్.
ఇక రావడం రావడమే తన హిట్టింగ్ మొదలుపెట్టిన బట్లర్ అదరగొట్టాడు అని చెప్పాలి. ముఖ్యంగా మేటి బౌలర్గా ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న రబడా బౌలింగ్లో బట్లర్ చితక్కొట్టుడు కొట్టాడు అని చెప్పాలి. వరుసగా 4,4,2,4 పరుగులు సాధించాడు. ఓవర్ లో 5వ బంతికి రబడా వేసిన యార్కర్ ను సమర్థవంతంగా ఎదుర్కొని బౌండరీ తరలించిన విధానం ఎంతగానో ఆకట్టుకుంది. అయితే 16 బంతుల్లో 5 ఫోర్లు ఓకే సిక్సర్ సహాయంతో 30 పరుగులు చేసిన బట్లర్.. ఇక ఈ సారి సెంచరీ చేయడం ఖాయం అనే విధంగానే జోరు మీద కనిపించాడు. కానీ ఆ తర్వాత రబడా బౌలింగ్లోనే ఆఖరి బంతిని గాలిలోకి లేపి చివరికి రాజపక్స కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు జోస్ బట్లర్. దీంతో అభిమానులు ఎంతగానో నిరాశ చెందారు.