వరల్డ్ కప్: అదరగొట్టిన ఇండియా... విండీస్ ముందు భారీ లక్ష్యం !
క్రికెట్ విశ్లేషకులు ఇచ్చిన సలహాను కూడా పాటించని టీంఇండియా యాజమాన్యం ఈ మ్యాచ్ కు కూడా షెఫాలీ వర్మను పక్కన పెట్టేసింది. కానీ ఇండియా ఇన్నింగ్స్ ను వేగంగానే ఆరంభించినా యస్తిక రూపంలో 49 పరుగుల వద్ద మొదటి వికెట్ కోల్పోయింది. ఇక వెంటనే మరో రెండు వికెట్లు కోల్పోవడంతో మళ్ళీ ఇండియా 200 అయినా చేస్తుందా అని అందరూ అనుకున్నారు. కానీ వాటన్నింటికీ అడ్డుకట్ట వేస్తూ ఓపెనర్ స్మృతి మందాన మరియు హర్మన్ ప్రీత్ కౌర్ లు వెస్ట్ ఇండీస్ బౌలర్లను ధాటిగా ఎదుర్కొని ఇండియాకు భారీ స్కోర్ ను అందించారు. స్మ్రితి మందన్న 119 బంతుల్లో 13 ఫోర్లు మరియు రెండు సిక్సర్ లతో 123 పరుగులు చేసి అవుట్ అయింది. హర్మన్ ప్రీత్ 107 బంతుల్లో 10 ఫోర్లు రెండు సిక్సర్ ల సాయంతో 109 పరుగులు చేసి అవుట్ అయింది.
వీరిద్దరూ కలిసి 4 వ వికెట్ కు 184 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసి రికార్డు సాధించారు. వరల్డ్ కప్ లలో భారత్ ఆ వికెట్ పై ఇదే అత్యధిక భాగస్వామ్యం. అలా నిర్ణీత ఓవర్ లలో ఇండియా 8 వికెట్ల నష్టానికి 317 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్ లో గెలవాలంటే విండీస్ 318 పరుగులు చేయాల్సి ఉంది.