కోహ్లీ vs బీసీసీఐ : వివాదం మొదలయిందా..?
ఈ విషయంపై కొహ్లీ, బీసీసీఐ మీడియాతో పంచుకున్న అంశాలు పరస్పరం భిన్నంగా ఉన్నాయి. ఈ అంశం కొత్త సందేహాలకు దారితీస్తోంది. దీంతో కొహ్లీ బీసీసీఐ మధ్య విభేదాలు మొదలయినట్టు వార్తలు వస్తున్నాయి. 2019 వన్డే ప్రపంచ కప్ సెమీస్లో న్యూజీలాండ్ చేతిలో భారత్ ఓటమి పాలయ్యాక కొహ్లీ-రోహిత్ శర్మల మధ్య విభేదాలు ఉన్నాయని వార్తలు వచ్చాయి. అయితే, వీటిపై మౌనం పాటించిన విరాట్ చివరకు తమ మధ్య అలాంటివేమీ లేవని చెప్పుకొచ్చాడు. దాంతో ఆ వివాదానికి తెరపడింది. అయితే, దక్షిణాఫ్రికాతో సిరిస్కు జట్టును ఎంపిక చేసినప్పుడే కొహ్లీకి బీసీసీఐ షాక్ ఇచ్చింది.
వన్డేలకు కెప్టేన్గా రోహిత్ శర్మను ప్రకటించింది. కోహ్లీని వన్డే సారథ్యం నుంచి వివాదం చెలరేగడంతో బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని కొహ్లీకి ముందే వివరించినట్టు తెలిపారు. టీ20 కెప్టెన్సీ వైదొలిగిన తరువాత తనతో ఎవరు మాట్లాడలేదన్నారు. దక్షిణాఫ్రికా టీమ్ను ప్రకటించే సమయంలో కాల్ ముగిసే ముందు తనను వన్డే కెప్టెన్గా తప్పిస్తున్నట్టు చెప్పారని కొహ్లీ తెలిపాడు. దీంతో కొహ్లీ - బీసీసీఐ మధ్య వివాదాలు తలెత్తాయని స్పష్టంగా అర్థమవుతోంది. ఈ నిర్ణయం తరువాత కొన్ని రోజులు మౌనంగా ఉన్న కొహ్లీ ఇప్పుడు బోర్డును, సెలెక్షన్ కమిటీ తప్పుబట్టడం చర్చనీయాంశంగా మారింది.