గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా.. ఐపీఎల్ లో?
దీంతో ఒక్కసారిగా 130 కోట్ల భారత ప్రజానీకానికి సూపర్ హీరోగా మారిపోయాడు. ఇకపోతే నీరజ్ చోప్రా పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తుంది. అయితే జూవేలిన్ త్రో విభాగంలో టోక్యో ఒలింపిక్స్ భారత్ కి గోల్డ్మెడల్ సాధించి ఎన్నో వీళ్ళ నిరీక్షణకు తెర దించిన నీరజ్ చోప్రా ఇటీవలే బిసిసీఐ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో దర్శనం ఇచ్చాడు. అదేంటి నీరజ్ చోప్రా ఐపీఎల్లో క్రికెట్ ఆడటం ఏంటి అని ఆశ్చర్య పోతున్నారు కదా.. ఈ ఫోటో చూస్తే మరింత ఆశ్చర్యపోతారు. అదేంటి నీరజ్ చోప్రా సడన్గా ఐపీఎల్లో ప్రత్యక్షం అయ్యాడు అని అనుకుంటారు.
ఒకవేళ మీరు అలా అనుకున్నారు అంటే పొరబడినట్లే.. ఎందుకంటే మీరు ఈ ఫోటోలో చూస్తున్నది నీరజ్ చోప్రా ని కాదు రాజస్థాన్ రాయల్స్ యువ పేసర్ కార్తీక్ త్యాగిని. ఇటీవలే రాజస్థాన్ రాయల్స్ పంజాబ్ కింగ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో కార్తీక్ త్యాగీ అద్భుతమైన ప్రదర్శన చేసి జట్టుకు విజయం అందించడంలో కీలక పాత్ర వహించాడు. చివరి ఓవర్ లో నాలుగు పరుగులు అవసరం కాగా కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇచ్చా