ప్రపంచటెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో ఎట్టకేలకు సౌతాఫ్రికా ఖాతా తెరిచింది. తాజాగా ఇంగ్లాండ్ తో సొంత గడ్డ పై జరిగిన మొదటి టెస్టు లో 107 పరుగుల తేడాతో సౌతాఫ్రికా విజయం సాధించింది. తద్వారా ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ లో 30పాయింట్ల ను సాధించింది. ఇటీవల భారత్ తో జరిగిన మూడు మ్యాచ్ ల టెస్టు సిరీస్ తోనే దక్షిణాఫ్రికా టెస్టు ఛాంపియన్ షిప్ ను మొదలు పెట్టగా... ఆ సిరీస్ లో అన్ని మ్యాచ్ ల్లో ఓటమి పాలై పాయింట్ల ఖాతా తెరవలేకపోయింది. ఇక ఇప్పుడు ఇంగ్లాండ్ పై గెలుపుతో 30పాయింట్లతో దక్షిణాఫ్రికా పట్టికలో ఏడవ స్థానం లో కొనసాగుతుంది.
ఇదిలావుంటే ఈ ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో ఒక్క ఓటమి కూడా లేకుండా భారత్ 360పాయింట్లతో అగ్ర స్థానం లో కొనసాగుతుండగా 256పాయింట్ల తో ఆస్ట్రేలియా రెండవ స్థానం లో వుంది. కాగా వెస్టిండీస్ , బంగ్లాదేశ్ ఇంతవరకు పాయింట్ల ఖాతా తెరవలేదు.