ప్రతి వ్యక్తి తన జీవితంలో చూడవలసిన శివాలయాలు ఏంటో తెలుసా..?

Divya
ఈ ఓంకారేశ్వరడు నుంచి వచ్చిన ఓంకారం పలకడం వల్ల మనలో ఏదో తెలియని పవిత్రత భావన కలుగుతుంది.త్రిమూర్తులలో ఒక్కడైన పరమశివుని దర్శించడం ప్రతి ఒక్కరి జీవితంలో ఒక గొప్ప అదృష్టంగా భావించవచ్చు. అలాంటి బోలా శంకరుని దర్శించడం వల్ల వారి కోర్కెలు కచ్చితంగా తీరుతాయి. అలాంటి శంకరుని అనుగ్రహం పొందడానికి మన దేశంలో కచ్చితంగా దర్శించవలసిన దేవాలయాలు కొన్ని ఉన్నాయి. ఆ దేవాలయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
 తుంగనాధ్ మహాదేవాలయం..
ఉత్తరాఖండ్ లో, హిమాలయాలను ఆనుకొని 3 వేల కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది. దీనిని సందర్శించడానికి చాలా కష్టపడాల్సి వచ్చినా,ఆ బోలా శంకర్ ని చూసి మరియు అక్కడి వాతావరణాన్ని చూసి ఆ కష్టం మొత్తం మర్చిపోతాము. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఈ దేవాలయాన్ని తప్పక దర్శించాలి.

 సోమనాథ ఆలయం..
ఈ దేవస్థానం గుజరాత్ లోని అత్యంత పవిత్రమైన ఈ సోమనాథ్ ఆలయం శివాలయం ద్వాదశ జ్యోతిర్లింగలలో అన్నిట్లోకి మొట్టమొదటిగా వెలిసిందని ప్రసిద్ధి.ఇక్కడ ఎప్పుడు శివనామా స్మరణ జరుగుతూనే ఉంటుంది.
కాశీ విశ్వనాథ ఆలయం..
హిందూ కుటుంబంలో పుట్టిన ప్రతి వ్యక్తి తమ జీవితంలో ఒక్కసారి అయినా కాశిని దర్శించుకోవాలని అనుకుంటారు.ఆ పరమేశ్వరుణ్ణి ప్రత్యక్షంగా దర్శించుకోవాలనుకునేవారు కచ్చితంగా కాశీకి వెళ్లి, కన్నుల పండుగ చేసుకోవాల్సిందే.ఇక్కడ శివునికిచ్చే హారతి చూస్తే చాలు జన్మ ధన్యమవుతుంది.
 అమర్నాథ్ ఆలయం..
 ఈ అమర్నాథ్ ఆలయం kashmir - SRINAGAR/JAMMU' target='_blank' title='జమ్మూ అండ్ కాశ్మీర్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">జమ్మూ అండ్ కాశ్మీర్ లో వెలసింది.ఈ.పరమేశ్వరుని దర్శించుకోవడానికి అత్యంత కష్టమైన యాత్రగా చెప్పవచ్చు. ఆ హిమాలయాలలోని,మంచు కొండలలో సహజ సిద్ధంగా మంచుతో ఏర్పడిన శివుని విగ్రహం ఉంటుంది. దీనిని దర్శించడం, గొప్ప అదృష్టముగా భావించవచ్చు.ఇక్కడ వేసవి కాలంలో మాత్రమే ప్రవేశం ఉంటుంది.
 తారకేశ్వర ఆలయం..
ఈ పరమేశ్వరుని ఆలయం పశ్చిమ బెంగాల్లో వెలసింది. ఈ శివుని ఆలయాలన్నిటికన్నా పురాతన ఆలయంగా దీనిని చెబుతుంటారు. ఇక్కడ ఎవరైతే రోజంతా ఉపవాస దీక్షతో ఆ పరమేశ్వరుని కొలుస్తారో వారికి కోర్కెలు కచ్చితంగా నెరవేరుతాయని ప్రసిద్ధి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: