అప్పుల బాధలు తీరాలంటే మంగళవారం పూట ఇలా చేసి చూడండి.!

Divya
ప్రతి ఇంట్లోను డబ్బు సమస్యలు ఉండనే ఉంటాయి. కొంతమందికి వారి ఖర్చులు, వారి సంపాదన బ్యాలెన్స్ అయి అప్పులు లేకుండా సాగిస్తుంటారు. కానీ కొంతమందికి అలా బ్యాలెన్స్ అవ్వక, అప్పుల పాలు అవుతుంటారు. అ తర్వాత ఎంత ప్రయత్నించిన అప్పులు తీరక సతమవుతమవుతుంటారు. దానికి కారణం వారికి వాస్తు దోషం లేక జన్మతహ దోషాలు ఉండవచ్చు.అలాంటి వారు కొన్ని రకాల పరిహారాలు చేయడం మూలాన పరిస్థితులను చక్కబెట్టుకోవచ్చని పండితులు సూచిస్తున్నారు. అందులో ముఖ్యంగా మంగళవారం పూట కొన్ని రకాల పనులు చేయడం వల్ల అప్పుల బాధలను తొందరగా తీర్చుకోవచ్చని పరిష్కారాలను చూపారు. ఆ పరిష్కారాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
మంగళవారం పూట మనీ ప్లాంట్  ఉన్న కుండీని బాగా కడిగి,పసుపు రాసి, కుంకుమ పెట్టి,పూలతో పూజ చేయాలి. తర్వాత మనీ ప్లాంట్ దగ్గర రెండు ప్రమిదలు తీసుకొని పసుపు కుంకమ రాసి, ఒకదాని నిండా ఉప్పు నింపి, మరొక దానిలో నువ్వుల నూనె, ఆముదం, కొబ్బరి నూనె వేసి దీపాన్ని పెట్టాలి. ఇలా పెట్టడం వల్ల ఇంట్లోనే నెగటివ్ ఎనర్జీ అంత పాజిటివ్ గా మారడానికి సహాయం చేస్తుంది. ఆ తర్వాత మనీ ప్లాంట్ కు ఎర్రటి గుడ్డముక్క తీసుకొని కట్టాలి. దీనితో మన ఇంట్లోకి రావాల్సిన చెడునంత ఇది గ్రహిస్తుంది.

 మరియు అదే రోజున మన ఇంటి బీరువాలో యాలకులు,లవంగాలు తీసుకొని ఎర్రటి జాకెట్ ముక్కలో కట్టి, మనం డబ్బులు పెట్టే లాకర్లో  ఉంచాలి. ఇలా చేయడం వల్ల, అవి వాటి సువాసలు వ్యాపింప చేసినట్టు, మన సంపదలు కూడా విస్తరిస్తాయి.ఈ పరిష్కారంతోపాటు కొన్ని పనులు మన ఇంట్లో దనం నిలబడేలా చేస్తాయి. అవేంటంటే అప్పులు ఏవైనా మంగళవారం పూట తీర్చడం మొదలుపెడితే తొందరగా అప్పులు తీరుతాయి. అదే విధంగా శుక్రవారం పూట రావాల్సిన డబ్బులను ఇంటికి తెచ్చుకోవడం వల్ల, మన ఇంట్లో డబ్బు కలకాలం నిలబడిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: