ఎందుకు : హిందూ సంప్రదాయంలో గోమాత ప్రాముఖ్యత ?
హిందూమతంలో గోవును పూజించడం ఎప్పటి నుంచో ఉంది. భవిష్య పురాణం ప్రకారం, ఆవులో మూడు లోకాలలోని మూడు వర్గాల దేవతలు నివసిస్తారని చెప్తోంది. శ్రీకృష్ణుడు ద్వాపర యుగంలో ఆవుతో ఎక్కువ సమయం గడిపాడు. గోవును పూజించేలా, సేవ చేసేలా ప్రజలను ప్రేరేపించాడు. ఇక సనాతన సంప్రదాయంలో అన్ని రకాల దానాలు గొప్ప దానాలుగా వర్ణించబడ్డాయి. ఇందులో గోదానానికి చాలా ప్రాముఖ్యత ఉంది. గరుణ పురాణం ప్రకారం వైతరణిని దాటడానికి గోదానం చాలా ముఖ్యమైనదని చెప్పారు. జనాలు తల్లిగా భావించే భూమిపై ఉన్న ఏకైక జంతువు ఆవు... జంతువులలో అత్యంత పవిత్రమైనదిగా భావించే ఆవు, కామధేనుడిలా అన్ని కోరికలను తీరుస్తుందని చెబుతారు.
హిందూ మతంలో ఆవు పేడను చాలా పవిత్రంగా భావిస్తారు. ఆవు పేడను ఏ పూజా పనిలోనైనా, భూమిని శుద్ధి చేయడానికి ఉపయోగిస్తారు. అదే సమయంలో పంచామృతం తయారీకి గోమూత్రాన్ని ఉపయోగిస్తారు. దీనితో పాటు ఆయుర్వేదంలో ఔషధ తయారీకి ఆవు మూత్రాన్ని ఉపయోగిస్తారు.
గోవుకు మతపరమైన ప్రాముఖ్యత మాత్రమే కాదు... జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 9 గ్రహాల శాంతికి ఆవును పూజించడం విశేషం. మీ జాతకంలో కుజుడు అశుభంగా ఉంటే, ఎరుపు రంగు ఆవు సేవ శుభ ఫలితాలను ఇస్తుంది. అదేవిధంగా బుధగ్రహం ఐశ్వర్యాన్ని పొందడానికి, ఆవుకు పచ్చి మేత ఇవ్వడం వల్ల ప్రయోజనాలు లభిస్తాయి. శనికి సంబంధించిన దోషం తొలగిపోవడానికి నల్ల రంగు ఆవు సేవ, దానం చాలా ఫలప్రదం.
చాలా కాలం తర్వాత కూడా మీరు సంతాన ప్రాప్తిని పొందలేకపోతే వాస్తు ప్రకారం, పడకగదిలో దూడకు ఆహారం ఇస్తున్న ఆవు విగ్రహాన్ని లేదా చిత్రాన్ని ఉంచడం శుభ ఫలితాలను ఇస్తుంది. త్వరలో సంతానం కలుగుతుంది.