"కన్నబిడ్డనే చంపిన తల్లి"... అదే దీపావళి?

VAMSI
హిందువులు ప్రత్యేక పండుగల్లో దీపావళి కూడా ఒకటి. చెడుని వధించి మంచిని ఆహ్వానించే పండుగే దీపావళి. అంటే మన జీవితంలో నుండి చీకటిని పారద్రోలి వెలుగులను నింపుకునే పండుగ. అందుకే దీపావళి రోజున అందరూ వారి ఇంటిని దీపాలతో నింపేస్తుంటారు. పురాణ కథనం ప్రకారం దీపావళి పండుగను అసలు ఎందుకు జరుపుకుంటాం అంటే.. భూదేవి మరియు వరహా స్వామికి అసుర గడియల్లో జన్మిస్తాడు నరకాసురుడు. ఇక అందుచేత అతడి దేహం మొత్తం అసుర లక్షణాలతో నిండిపోతుంది. ఆయన్ని ముల్లోకాలకు అధిపతి అయిన శ్రీహరి కూడా సంహరించలేని విధంగా వరం పొంది ఉంటాడు. కేవలం తన కన్న తల్లి చేతిలోనే మరణించేలా వరం పొంది ఉంటాడు. అలా ఆ వరం ఉందనే అతి విశ్వాసంతో వరగర్వంతో ఈ లోకాన్ని శాసిస్తూ నరకుడు ముల్లోకాలను ముప్పతిప్పలు పెడుతుంటాడు.

అయితే రోజురోజుకు నరకాసురుడి బాధలు, వేదింపులు ఎక్కువ అవడంతో  భరించలేని దేవతలు,  గంధర్వులు, మునులు, తమ  బాదని ఆ శ్రీహరికి చెప్పుకుని తమని రక్షించమని ప్రాదేయపడతారు. వారి గోడును విన్న శ్రీహరి ద్వాపర యుగంలో కృష్ణుడిగా అవతరించి ఆ తర్వాతా సత్యభామగా అవతరించిన భూదేవిని వివాహం ఆడి నరకాసురుడిని సంహరింపజేయిస్తాడు. అలా నరకాసురుని చావు ఆయన తల్లి చేతుల్లోనే జరుగుతుంది. దాంతో ముల్లోకాలకు నరకాసుర నుండి విముక్తి లభిస్తుంది. అంటే అందరి జీవితంలో అలుముకున్న చీకటి కోణాలు వీడి కొత్త వెలుగులు ప్రసరించిన రోజు అన్నమాట. అందుకే ప్రతి ఏడు ఆ రోజున అందరూ దీపావళి వెలిగించి తమ జీవితంలోకి వచ్చిన వెలుగులను ఆహానిస్తు జరుపుకోవడం మొదలయ్యింది అని ఒక పురాణ కథనం.

అయితే ఇంతటి చరిత్ర ఉన్న దీపావళి రోజున కొన్ని పనులు తప్పకుండా చేయాలని వేద పండితులు చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దీపావళి రోజున ఇంటిలో దీపాలు వెలిగించాలి. అయితే చాలా మంది పండుగ రోజు కావడంతో ఊర్లకు ప్రయాణం అవుతుంటారు. అలాంటి వారు వీలైనంత వరకు ఉదయం పూజ చేసుకుని దీపం వెలిగించి వెళ్ళాలి. లేదా కనీసం ఇంట్లో లైట్లు వంటివి వేచి వెళ్ళాలి. ఇంటిని మాత్రం అస్సలు చీకట్లో ఉంచి వెళ్లడం మంచిది కాదని చెబుతున్నారు. అలాగే ఈ రోజున మహాలక్ష్మిని పూజించండి సర్వ శ్రేష్టం. లక్ష్మి దేవిని తప్పక పూజించాలి అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: