సూర్య దేవుని రథానికి ఏడు గుర్రాలు ఎందుకుంటాయో తెలుసా...?

VAMSI
మాములుగా మనకు తెలిసిన హిందూ పురాణాలు ప్రకారం ప్రతి ఒక్క దేవుడికి మరియు దేవతకు ఒక వాహనం అలాగే ఏదైనా జంతువు రథ సారధిగా ఉంటుంది. అయితే అన్ని దేవుళ్ళకు వివిధ రకాల వాహనాలు మరియు రధ సారధులు కలిగి ఉన్నారు. అయితే అన్ని దేవుళ్లలో కన్నా ప్రత్యక్ష దైవం అయినటువంటి సూర్య భగవానుడికి మాత్రం ఏకంగా ఏడు గుర్రాలు రధ సారధులుగా ఉన్నారు. అయితే భక్తులందరికీ ఒక సందేహం కలుగక మానదు. ఎందుకని ఏడు గుర్రాలు ఉండాలి. ఒక గుర్రం ఉండచ్చు కదా అని. సమస్త లోకాలకు వెలుగు ప్రసాదిస్తున్న ప్రత్యక్ష నారాయణుడని పేరు కూడా ఉంది.  సూర్యుడికి త్రిమూర్తుల స్వరూపమనే బిరుదు కూడా ఉంది.
ప్రతి మాఘ శుద్ధ సప్తమి రోజున సూర్య భగవానుడు సత్యాస్వ రథంపై తిరుగుతాడు. సూర్యుని కాంతి ఏడు వర్ణాల కలయిక అని మనకు తెలిసిందే. అందుకే ఏడు గుర్రాల మీద సూర్యుడు సంచరిస్తాడని వేదాలు వల్లిస్తున్నాయి. ఈ ఏడు గుర్రాలకు పేర్లు కూడా ఉన్నాయి. అవేమిటంటే 1) గాయత్రి 2) త్రిష్ణుప్పు 3) అనుష్టుప్పు 4) జగతి 5) పంక్తి 6) బృహతి 7) ఉష్ణిక్కు..వీటినే చంధస్సులంటారు. అంతే కాకుండా హిందువులు ఆచరించే క్యాలెండర్ ప్రకారం ఒక సంవత్సరంలో ఒక్కో నెలకు ఒక్కో సూర్యుడు ప్రాధాన్యత వహించడం జరుగుతుంది. ఈ రథానికి ఉన్న ఇరుసు...పగలు మరియు రాత్రి సమయాలకు గుర్తుగా చెబుతున్నారు.
రధ చక్రాలకు ఉండే ఆరు ఆకులు ఋతువులకు మరియు ధర్మానికి గుర్తుగా చెబుతున్నారు.  ఈ విధంగా సూర్యుని రథానికి మరియు రథ సారధికి ప్రాముఖ్యతను చెబుతున్నారు. సూర్యునికి ప్రతి రోజూ ఉదయాన్నే పూజ చేయడం వలన ఆయన మీపై తన దయని కలిగి ఉంటాడని చెబుతారు. అంతే కాకుండా మీకు ఎటువంటి కుటుంబ సమస్యలు ఉన్న వాటికి సత్వర పరిస్కారాన్ని చూపుతాడని భక్తులు నమ్ముతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: