శివరాత్రి రోజున భక్తులు ఉపవాసం ఉండడానికి గల ఆంతర్యం ఇదే... !

frame శివరాత్రి రోజున భక్తులు ఉపవాసం ఉండడానికి గల ఆంతర్యం ఇదే... !

Suma Kallamadi
మన హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో శివరాత్రి పండగ కూడా ఒకటి.ప్రత్యేకంగా శివరాత్రి రోజున మహా శివుడిని అత్యంత భక్తి శ్రద్దలతో పూజిస్తూ ఉంటారు. శివరాత్రి రోజున చాలా మంది హిందువులు ఉపవాసం చేసి రాత్రి అంతా జాగరణ చేస్తారు.అలాగే శివుడు కొలువున్న ప్రధాన ఆలయాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. శివునికి రుద్రాభిషేకం చేయడం, ప్రత్యేక పూజలు నిర్వహించడం లాంటివి చేస్తారు. పంచామృతాల తో శివునికి అభిషేకం చేసి శివయ్యకి  ప్రీతికరమైన ఉమ్మెత పూలతో, మారేడు దళాలతో పూజ చేసి, ధూప దీప నైవేద్యాలను అర్పిస్తారు. అలాగే చాలామంది  ఈరోజు ఉపవాసం ఉండి రాత్రి అంతా జాగారం చేస్తారు. కానీ చాలామందికి శివరాత్రి రోజున ఉపవాసం ఎందుకు ఉంటారో అనే విషయాలు తెలియవు. మరి ఆ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..!


మహా శివరాత్రి నాడు భక్తి శ్రద్దలతో పూజ చేసి  ఉపవాసం ఉండి దేవుడిని ఆరాధించడం వల్ల తమకు మంచి భర్త వస్తారని మహిళలు నమ్ముతారు. ఎవరికైనా చాలా కాలం నుండి వివాహం జరగకపోతే ఉపవాసం చేయడం వల్ల ఆ అడ్డంకులు తొలగిపోతాయని పండితులు అంటున్నారు.ఇలా ఉపవాసం చేస్తే దేవుడి ఆశీర్వాదం దొరుకుతుందని, వివాహం జరుగుతుందని నమ్ముతారు. అలానే శివునికి పూజ చేసి ఉపవాసం చేయడం వల్ల జీవితం లో ఆనందం, శాంతి, శ్రేయస్సు కలుగుతుందని పండితులు చెబుతున్నారు.



శివధ్యానం చేస్తే శివానందం కలుగుతుంది. శివుని అనుగ్రహం లభిస్తుంది. ఇలా శివధ్యానం చేయాలంటే రోజంతా మేల్కొని ఉండాలి. అలా మేల్కొని ఉండాలి అంటే పొట్టను ఖాళీగా ఉంచాలి. కాబట్టి భక్తులు ఎంతో నియమ నిబంధనతో రోజంతా మహాశివుణ్ని ధ్యానిస్తూ ఉపవాసం చేయాలి. వాస్తవానికి మహాశివరాత్రినాడు శివధ్యానంలో ఉన్న భక్తులకు ఆకలి వేయదట.మహాశివరాత్రి రోజున, ఉదయాన్నే లేచి, స్నానం చేసి, శుభ్రమైన బట్టలు వేసుకుని ఉపవాసం ప్రారంభించండి. మీకు, మీ కుటుంబానికి అంతా మంచే జరుగుతుంది.. !!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: