WTC ఫైనల్.. లండన్ వెళ్లిన టీమ్ ఇండియా ప్లేయర్లు?

praveen
ఇండియన్ ప్లేయర్లందరూ కూడా ప్రస్తుతం భారత్ వేదికగా జరుగుతున్న.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో బిజీబిజీగా ఉన్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం ప్లే ఆఫ్ లో భాగంగా నాకౌట్ మ్యాచ్ లు జరుగుతూ ఉన్నాయి అని చెప్పాలి. అయితే ఇక ఐపీఎల్ ఫైనల్ ముగిసిన వెంటనే కొన్ని రోజుల వ్యవధిలోనే అటు టీమిండియా ప్లేయర్స్ అందరూ కూడా ఇంగ్లాండులోని లండన్ వేదికగా జరగబోయే డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్లో ఆడబోతున్నారు అన్న విషయం తెలిసిందే. ఈ ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలబడబోతున్నారు. గత ఏడాదిలాగా ఎలాంటి మిస్టేక్స్ చేయకుండా ఈసారి విశ్వవిజేతగా నిలవాలని ఆశపడుతున్నారు.

 ఈ క్రమంలోనే బీసీసీఐ కూడా డబ్ల్యూటీసి ఫైనల్ కోసం అన్ని రకాల వ్యూహాలను సిద్ధం చేసింది. అయితే ఐపీఎల్ లో భాగంగా ప్లే ఆఫ్ లో  నాలుగు జట్లు మాత్రమే అడుగుపెట్టడంతో ఇక మిగతా జట్ల తరఫున ఆడుతున్న భారత ఆటగాళ్లు ఇక డబ్ల్యూటీసి ఫైనల్ కోసం సిద్ధమవుతున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక డబ్ల్యూటీసి ఫైనల్ కోసం సెలెక్ట్ అయిన ఆటగాళ్లు నేడు కొంతమంది లండన్ బయలుదేరబోతున్నారు అన్నది తెలుస్తుంది. కోచ్ రాహుల్ ద్రావిడ్ తో సహా సహాయ సిబ్బంది కొంతమంది ప్లేయర్లతో కూడిన మొదటి బ్యాచ్ నేడు ఇక ఇంగ్లాండ్ వెళ్లనున్నారు.

 కాగా మే 28వ తేదీన అటు ఐపిఎల్ ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ తర్వాత మే 30వ తేదీన మిగతా ప్లేయర్స్ అందరూ కూడా ఇంగ్లాండు వెళ్లబోతున్నారు అన్నది తెలుస్తోంది. ఇక నేడు ఇంగ్లాండ్ కు వెళ్లే వారిలో శార్దూల్ ఠాగూర్, అక్షర పటేల్, అశ్విన్, సిరాజ్, కోహ్లీ నువ్వు ఉన్నారు అన్నది తెలుస్తుంది. అయితే ఒకవైపు ఆస్ట్రేలియా మరోవైపు టీమ్ ఇండియా కూడా ఎంతో పటిష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో.. ఇక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో ఎవరు విజేతగా నిలుస్తారో అనే విషయంపై విశ్లేషకులు కూడా ఒక అంచనాకు రాలేకపోతున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: