ప్రత్యర్ధులుగా పాండ్యా బ్రదర్స్.. హార్దిక్ ఆసక్తికర పోస్ట్?

praveen
ఇటీవల ఐపీఎల్  లో భాగంగా ఒక అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతం అయింది అన్న విషయం తెలిసిందే. ఐపీఎల్ లోనే మొట్టమొదటిసారి అన్నదమ్ములు ఇద్దరు కూడా చెరో జట్టుకు కెప్టెన్సీ వహించి ఇక మ్యాచ్లో ప్రత్యర్థులుగా తలబడిన ఘటన జరిగింది . ఇటీవలే ఐపీఎల్లో భాగంగా గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరిగింది. అయితే గుజరాత్ టైటాన్స్ కి హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ వహిస్తూ ఉన్నాడు. ఇక లక్నో సూపర్ జేయింట్స్ జట్టు కెప్టెన్ గా ఉన్న కేఎల్ రాహుల్ దూరం కావడంతో ఇక సారధ్య బాధ్యతలను భుజాన వేసుకున్నాడు కృణాల పాండ్య.

 వీరిద్దరూ సొంత అన్నదమ్ములు అన్న విషయం తెలిసిందే. ఇక విరిద్దరిని పాండ్యా బ్రదర్స్ అని అటు భారత క్రికెట్ ప్రేక్షకులు కూడా పిలుచుకుంటూ ఉంటారు. ఇక గతంలో ఇద్దరు కూడా అటు టీమిండియాలోకి వచ్చి తమ హవా నడిపించారు. ఇక ఐపీఎల్ లో సైతం ముంబై ఇండియన్స్ లో కీలక ప్లేయర్లుగా ఎన్నో ఏళ్లపాటు ప్రస్థానాన్ని కొనసాగించారు. ఇక ఇటీవల వేరు వేరు జట్లకు కెప్టెన్సీ వహించి ఐపీఎల్ లో తలబడటం ద్వారా ఈ ఘనత సాధించిన తొలి తొలి ప్లేయర్లుగా రికార్డు సృష్టించారు.

 ఈ క్రమంలోనే ఇదే విషయంపై స్పందించిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆసక్తికర పోస్ట్ పెట్టాడు. బరోడా నుంచి వచ్చిన ఇద్దరు కుర్రాళ్ళు.. తమ కలలను సహకారం చేసుకునేందుకు ఎప్పుడు వెనకడుగు వేయలేదు అంటూ ఇక తమ చిన్నప్పటి ఫోటోని హార్దిక్ పాండ్యా పోస్ట్ చేశాడు. దేవుడు మా పట్ల దయతో ఉన్నాడు.. ఇక మా కుటుంబం మా ఆటపట్ల గర్వంగా ఉంది అంటూ మ్యాచ్ పూర్తయిన తర్వాత కృనాల్ పాండ్య మీడియా సమావేశంలో తెలిపాడు. ఏది ఏమైనా ఇలా పాండ్యా బ్రదర్స్ ని కెప్టెన్లుగా అది కూడా ఐపీఎల్ లో ప్రత్యర్ధులుగా చూసి ఫాన్స్ వీరి మధ్య పోరుని తెగ ఎంజాయ్ చేశారు అని చెప్పాలి. కాగా ఈ మ్యాచ్ లో గుజరాత్ విజయం సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: