ప్లే ఆఫ్ లో అడుగుపెట్టే.. నాలుగు జట్లు ఇవే : హర్భజన్

praveen
ప్రస్తుతం ఐపీఎల్ పోరు ఎంతో రసవత్తరంగా సాగుతూ ఉంది అనే విషయం తెలిసిందే. ప్రతి మ్యాచ్ కూడా నువ్వా నేనా అన్నట్లుగానే ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతుంది. అయితే ప్రస్తుతం లీగ్ మ్యాచ్లు చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో.. ఇక పాయింట్లు పట్టికలో మొదటి నాలుగు స్థానాలలో చోటు సంపాదించుకోవడం కోసం అన్ని జట్లు కూడా హోరాహోరీగా పోరు సాగిస్తున్నాయ్ . ఈ క్రమంలోనే నువ్వా నేనా అన్నట్లుగా సాగుతున్న పోరులో చివరి బంతి వరకు కూడా విజేత ఎవరో తెలియని విధంగా మారిపోయింది పరిస్థితి.

 ఒక రకంగా చెప్పాలి అంటే మ్యాచ్లో ఉన్న ఉత్కంఠ అటు ప్రేక్షకులు అందరిని కూడా ముని వేళ్ళ పై నిలబెడుతుంది. టీవీల ముందు కూర్చున్న ప్రేక్షకులను కన్నారపకుండా చూసేలా చేస్తుంది అని చెప్పాలి. ఇలా ఒకవైపు మ్యాచ్లో ఎంటర్టైన్మెంట్ పంచుతూ ఉంటే ఇక మరోవైపు మాజీ ఆటగాళ్లు మ్యాచ్ల విషయంలో ఇస్తున్న రివ్యూలు కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి. ముఖ్యంగా ఇక ఇప్పుడు లీగ్ మ్యాచ్ లు చివరి దశకు చేరుకున్నాయ్. దీంతో ప్లే ఆఫ్ కు వెళ్లే జట్లు ఏది అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది. దీనిపై ఎంతమంది మాజీ ఆటగాళ్ళు తమ అభిప్రాయాలను రివ్యూల రూపంలో ప్రకటిస్తున్నారు.

 ఇకపోతే ఇటీవల ఇదే విషయంపై టీమిండియా మాజీ ప్లేయర్ హర్భజన్ సింగ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు అని చెప్పాలి. చెన్నై సూపర్ కింగ్స్,  గుజరాత్ టైటాన్స్,  ముంబై ఇండియన్స్,  రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు ప్లే ఆఫ్ లో అడుగుపెడతాయి అంటూ జోష్యం చెప్పాడు హర్భజన్ సింగ్. ఇక ప్రస్తుత పరిస్థితులు చూస్తే మాత్రం 12 పాయింట్లతో మొదటి ప్లేస్ లో గుజరాత్ జట్టు కొనసాగుతూ ఉంది. ఆ తర్వాత లక్నో, చెన్నై, రాజస్థాన్, ఆర్సిబి, ముంబై, పంజాబ్, కేకేఆర్, హైదరాబాద్, ఢిల్లీ జట్లు ఉన్నాయి మరి హర్భజన్ చెప్పినట్లుగా జరగాలి అంటే ఎన్నో అద్భుతాలు జరగాలి అని చెప్పాలి ఏం జరుగుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: