ఇలా ఉంటే.. ఎంతటి బౌలర్ అయిన ఏం చేయలేడు : ధోని

praveen
2023 ఐపీఎల్ సీజన్లో వరుస విజయాలు సాధిస్తూ జోరు కనబరిచిన చెన్నై సూపర్ కింగ్స్ జైత్ర యాత్రకు బ్రేక్ పడింది అని చెప్పాలి. ఇటీవల రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఘోర ఓటమి చవి చూసింది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఏకంగా 32 పరుగుల తేడాతో పరాజయం పాలైంది అని చెప్పాలి. ఈ మ్యాచ్ లో భాగంగా మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టు 202 పరుగులు చేసింది. ఆ తర్వాత భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి కేవలం 170 పరుగులు మాత్రమే చేయగలిగింది అని చెప్పాలి.

 దీంతో అటు రాజస్థాన్ రాయల్స్ కు కనీస పోటీ ఇవ్వలేక 32 పరుగుల తేడాతో ఓడిపోయింది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు. అయితే ఇక ఇలా రాజస్థాన్ చేతిలో ఓటమిపై మ్యాచ్ అనంతరం మాట్లాడిన చెన్నై జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ పిచ్ పై ఇంత టార్గెట్ ను చేదించడం అంటే కొంచెం కష్టతరమైన పనే అంటూ చెప్పుకొచ్చాడు. అయితే తొలి ఆరు ఓవర్లలో మా బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. తర్వాత మిడిల్ ఓవర్లలో బౌలర్లు మంచి ప్రదర్శన చేసినప్పటికీ కొన్ని మిస్ ఫీల్డ్ కారణంగా పరుగులు వచ్చాయి.

 పతిరానా బౌలింగ్ బాగానే ఉంది. అయితే ఇలా బ్యాటింగ్కి అనుకూలంగా ఉన్న పిచ్ ఉన్నప్పుడు ఎంతటి బౌలర్ అయిన కూడా ఏం చేయలేని పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అంటూ మహేంద్ర సింగ్ ధోని చెప్పుకొచ్చాడు. ఇక రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ విభాగం అద్భుతంగా రాణించిందని ముఖ్యంగా యశస్వి జైస్వాల్, దృవ్ జూరేల్ లాంటి కుర్రాళ్ళు అద్భుతంగా ఆడారు అంటూ ప్రశంసలు కురిపించాడు మహేంద్రసింగ్ ధోని. ప్రతి మ్యాచ్ లో గెలుపు ఒక్కరికే దక్కుతుంది ఈరోజు ఆ గెలుపు రాజస్థాన్ దే అంటూ ధోని చెప్పుకొచ్చాడు. జైపూర్ అంటే తనకు చాలా ఇష్టమని.. నా కెరియర్ టర్నింగ్ పాయింట్ ఇక్కడ నుంచే మొదలైంది అంటూ ధోని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: