క్రికెట్ గాడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కుటుంబానికి ఆదివారం (ఏప్రిల్16) అనేది నిజంగా ఎంతో ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే అతని తనయుడు అర్జున్ టెండూల్కర్ ఎట్టకేలకు ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు.ఆదివారం నాడు కోల్కతా రైట్ నైడర్స్ మ్యాచ్తో ఐపీఎల్ కెరీర్ను ప్రారంభించాడు అర్జున్ టెండూల్కర్. ఇంకా అంతేకాదు కోల్కతా ఇన్నింగ్స్లో మొదటి ఓవర్ను కూడా అర్జునే వేయడం విశేషం. ఇక అర్జున్ మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు సచిన్తో పాటు ఆయన భార్య అంజలి, కూతురు సారా హాజరయ్యారు. ముంబైలోని వాంఖడే స్టేడియంతో సచిన్కు ఎంతో మంచి అనుబంధం ఉంది. తన క్రికెట్ కెరీర్కు సంబంధించి ఎన్నో మధుర జ్ఞాపకాలున్నాయి. ఇక ఈ మైదానంలోనే సచిన్ తన 200వ టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ప్రపంచకప్ను కూడా ఈ వేదిక మీదే సచిన్ అందుకున్నాడు. ఇలా సచిన్కు చాలా మధురజ్ఞాపకాలను అందించిన వాంఖడేలోనే ఆయన కుమారుడు అర్జున్ టెండూల్కర్ అరంగేట్రం చేయడం విశేషం.ఇక ఐపీఎల్ అరంగేట్రంలోనే అర్జున్ టెండూల్కర్ అద్వితీయ రికార్డును నమోదు చేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో తండ్రీ కొడుకుల జోడీ ఆడడం ఇదే ఫస్ట్ టైం. సచిన్ టెండూల్కర్ గతంలో ఐపీఎల్లో ముంబై ఇండియన్స్కు ఆటగాడిగా ఇంకా కెప్టెన్గా సేవలందించాడు.
సచిన్ టెండూల్కర్ మొత్తం 78 మ్యాచ్ల్లో ముంబైకి ప్రాతినిధ్యం వహించాడు. సారథిగా 2013 వ సంవత్సరంలో ముంబై ఇండియన్స్కు తొలిసారి ఐపీఎల్ ట్రోఫీని అందించాడు సచిన్. ఇది జరిగిన సుమారు 10 ఏళ్ల తర్వాత తన కొడుకు అర్జున్ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ క్రమంలో తన తనయుడి ఐపీఎల్ ఎంట్రీపై భావోద్వేగానికి గురయ్యాడు సచిన్ టెండూల్కర్ . సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ ని షేర్ చేసుకున్నాడు సచిన్.ఇక మ్యాచ్కు ముందు అర్జున్తో కలిసున్న ఫొటోలను షేర్ చేసిన సచిన్…'అర్జున్, ఈ రోజు నువ్వు క్రికెటర్గా నీ ప్రయాణంలో మరో కీలక అడుగు వేశావు. నీ తండ్రి లాగానే నీకు కూడా ఆటంటే ఎక్కువ ఇష్టం.ఇక క్రికెట్కు నవ్వు తగిన గౌరవాన్ని ఇస్తావు. ఇప్పుడు నీ ఆటే నిన్ను తిరిగి ప్రేమిస్తుందని నేను నమ్ముతున్నా. నువ్వు ఇక్కడికి రావడానికి ఎంతో కష్టపడ్డావు. నువ్వు దానిని కొనసాగిస్తావని నేను భావిస్తున్నా. ఇది ఖచ్చితంగా ఒక అందమైన ప్రయాణానికి నాంది కావాలి. ఆల్ ది బెస్ట్' అంటూ అర్జున్ టెండూల్కర్ కు విషెస్ తెలిపాడు సచిన్ టెండూల్కర్.